సహజీవనం చేస్తున్న భాగస్వామిని ముక్కలుగా కోసి కుక్కర్‌లో ఉడికించి

|

Jun 12, 2023 | 9:29 PM

ఒకరినొకరు అర్థం చేసుకునేందుకని సహజీవనం చేస్తూ ప్రియుడి చేతిలో అమ్మాయిలు బలైపోతున్న ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. గతంలో ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇటీవలే బెంగళూరులోని ఇద్దరు ప్రేమికులు సహజీవనం చేస్తుండగా..

ఒకరినొకరు అర్థం చేసుకునేందుకని సహజీవనం చేస్తూ ప్రియుడి చేతిలో అమ్మాయిలు బలైపోతున్న ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. గతంలో ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇటీవలే బెంగళూరులోని ఇద్దరు ప్రేమికులు సహజీవనం చేస్తుండగా.. యువకుడు తన ప్రియురాలి గొంతునులిమి హత్య చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలు మరవకముందే ఇప్పుడు తాజాగా ముంబయిలో మరో దారుణం చోటుచేసుకుంది. సహజీవన భాగస్వామిని హత్య చేసిన ఓ వ్యక్తి ఆమె శరీర భాగాల్ని ముక్కలుముక్కలుగా చేశాడు. ముంబయిలోని గీతానగర్‌లో మనోజ్ సహాని అనే 53 ఏళ్ల వ్యక్తి , సరస్వతి అనే 36 ఏళ్ల మహిళ మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరిమధ్యా కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అవి కాస్త పెద్దవవడంతో మనోజ్ విసిగిపోయాడు. చివరికి ఆమెను హత్య చేశాడు. అనంతరం చెట్లు కట్‌ చేసే కట్టర్‌తో ఆమె మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా కోశాడు. అంతేకాదు రోజూ వాటిని ప్రెషర్ కుక్కర్లో ఉడకబెడుతున్నాడు. ఇలా ఉండగా… నిన్న వీళ్లు ఉంటున్న ఇంటినుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగువారు ఏమై ఉంటుందా అని పరిశీలించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మరికాసేపట్లో పెళ్లిపీటలెక్కాల్సిన వరుడు.. పాడెపై.. ఏం జరిగిందంటే ??

విస్కీని తాగడమేకాదు.. తినొచ్చుకూడా.. ఎలా అంటే ??

మేడమ్‌.. అది పిల్లికాదు.. పులి.. జాగ్రత్త

త‌ల్లిని కాపాడిన బేబీ గొరిల్లా.. ఏం చేసిందంటే ??

స్వీట్లు అంటే ఇష్టమా ?? అయితే మీరు విషయం తింటున్నట్లే !!

Follow us on