ఓ ఏనుగు బీభత్సం సృష్టించిన ఘటన కేరళలోని తిరువిల్వామల విల్వద్రినాథ గుడిలో జరిగింది. ఓ వ్యక్తి ఏనుగుపై నుంచి కింద పడి గాయాల పాలయ్యారు. అతను ఏనుగు దాడి నుంచి తప్పించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గుడికి చెందిన అదత్తు పరమ్ అక పానచెరి పరమేశ్వరం అనే ఏనుగు ఒకేసారి తన శరీరాన్ని విదిల్చుతూ, బీభత్సం సృష్టించింది. ఆ సమయంలో గుడి సిబ్బంది కునిసెరి స్వామినాథన్ ఏనుగుపై ఉన్నారు. ఏనుగు చేష్టలతో ఆయన కింద పడ్డారు. కింద పడిన అతనిపై ఏనుగు దాడి చేయడానికి ప్రయత్నించింది. స్వామినాథన్ దాని నుంచి తప్పించుకున్నారు. స్వామినాథన్కు చిన్నపాటి గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video : వామ్మో.. రాక్షస సుడిగాలి.. ట్రక్కును ఎత్తిపడేసింది! వీడియో
RBI Scholarship: ఆర్బీఐ స్కాలర్షిప్.. నెలకు రూ.40 వేలు.. వీడియో