ఒక్కసారిగా కుంగిపోయిన ఇంట్లోని భూమి.. 20 అడుగుల లోతులో పడ్డ మహిళ..

దేశవ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహారాష్ట్ర చంద్రపూర్‌లో ఓ మహిళకు తృటిలో ప్రమాదం తప్పింది. భారీ వర్షాలకు రయిత్వారీ కాలనీలోని ఓ ఇంట్లో భూమి కుంగి.. 20 అడుగుల గుంతలో పడిపోయిందో మహిళ. ఆమె కేకలు విన్న స్థానికులు నిచ్చెన సహాయంతో బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.

ఒక్కసారిగా కుంగిపోయిన ఇంట్లోని భూమి.. 20 అడుగుల లోతులో పడ్డ మహిళ..

|

Updated on: Aug 05, 2024 | 9:28 PM

దేశవ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహారాష్ట్ర చంద్రపూర్‌లో ఓ మహిళకు తృటిలో ప్రమాదం తప్పింది. భారీ వర్షాలకు రయిత్వారీ కాలనీలోని ఓ ఇంట్లో భూమి కుంగి.. 20 అడుగుల గుంతలో పడిపోయిందో మహిళ. ఆమె కేకలు విన్న స్థానికులు నిచ్చెన సహాయంతో బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పరిస్థితులను చక్కదిద్దారు. రయిత్వారీ కాలనీలో వెస్ట్రన్ కోల్ ఫీల్డ్‌కు చెందిన బొగ్గుగని ఉంటుంది. ఇక్కడి భూగర్భ గనిలోంచి బొగ్గును తీసిన తర్వాత అధికారులు ఆ ప్రాంతాన్ని వెంటనే ఇసుకతో పూడ్చాలి. అయితే గనుల్లోంచి బొగ్గు తీసిన తర్వాత ఇసుక నింపకపోవడం, వర్షాలు కురుస్తుండటంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ఇక్కడి ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈసారి ఖైరతాబాద్‌ గణేషుడి ఎత్తు ఎంతో తెలుసా ??

అండర్‌ గ్రౌండ్‌లో గ్రహాంతరవాసి ఆలయం.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Nayanthara: వయనాడ్ బాధితులకు న‌య‌న‌తార, విఘ్నేశ్ దంపతుల విరాళం

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా ?? ఇలా చేసి చూడండి !!

ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులు బంద్‌.. పశ్చిమాసియాలో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు

Follow us