ఒక్కసారిగా కుంగిపోయిన ఇంట్లోని భూమి.. 20 అడుగుల లోతులో పడ్డ మహిళ..
దేశవ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వయనాడ్లో కొండచరియలు విరిగిపడి వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహారాష్ట్ర చంద్రపూర్లో ఓ మహిళకు తృటిలో ప్రమాదం తప్పింది. భారీ వర్షాలకు రయిత్వారీ కాలనీలోని ఓ ఇంట్లో భూమి కుంగి.. 20 అడుగుల గుంతలో పడిపోయిందో మహిళ. ఆమె కేకలు విన్న స్థానికులు నిచ్చెన సహాయంతో బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.
దేశవ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వయనాడ్లో కొండచరియలు విరిగిపడి వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహారాష్ట్ర చంద్రపూర్లో ఓ మహిళకు తృటిలో ప్రమాదం తప్పింది. భారీ వర్షాలకు రయిత్వారీ కాలనీలోని ఓ ఇంట్లో భూమి కుంగి.. 20 అడుగుల గుంతలో పడిపోయిందో మహిళ. ఆమె కేకలు విన్న స్థానికులు నిచ్చెన సహాయంతో బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పరిస్థితులను చక్కదిద్దారు. రయిత్వారీ కాలనీలో వెస్ట్రన్ కోల్ ఫీల్డ్కు చెందిన బొగ్గుగని ఉంటుంది. ఇక్కడి భూగర్భ గనిలోంచి బొగ్గును తీసిన తర్వాత అధికారులు ఆ ప్రాంతాన్ని వెంటనే ఇసుకతో పూడ్చాలి. అయితే గనుల్లోంచి బొగ్గు తీసిన తర్వాత ఇసుక నింపకపోవడం, వర్షాలు కురుస్తుండటంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ఇక్కడి ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈసారి ఖైరతాబాద్ గణేషుడి ఎత్తు ఎంతో తెలుసా ??
అండర్ గ్రౌండ్లో గ్రహాంతరవాసి ఆలయం.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
Nayanthara: వయనాడ్ బాధితులకు నయనతార, విఘ్నేశ్ దంపతుల విరాళం
అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా ?? ఇలా చేసి చూడండి !!
ఇజ్రాయెల్కు విమాన సర్వీసులు బంద్.. పశ్చిమాసియాలో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

