తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు మీద పడి దాడి చేస్తున్నాయి. కాకినాడ జగన్నాధపురం పద్మానగర్ లో పిచ్చికుక్క ఇద్దరు చిన్న పిల్లలపై దాడి చేసింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై గాయపడిన ఇద్దరు పిల్లలను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిచ్చి కుక్క కదాడిలో గాయపడిన ఇద్దరు పిల్లలలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తెలంగాణలోనూ అదే పరిస్థితి.తాజాగా సంగారెడ్డి జిల్లాలో కుక్కలు బీభత్సం సృష్టించాయి. శ్రీనగర్ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై ఏకంగా ఆరు కుక్కలు దాడి చేశాయి. బాలుడి కేకలు విన్న స్థానికులు రాళ్లతో కుక్కలను కొట్టి అక్కడి నుంచి తరిమేశారు. కుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. బాలుడిపై కుక్కలు దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ రికార్డు అయ్యింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శివతేజ అందిస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.