భానుడి ఉగ్రరూపం.. ఏకంగా రైలు పట్టాలే కాలిపోయాయి !! ఎక్కడంటే ??

|

Jul 15, 2022 | 9:49 AM

భారతదేశమంతా వర్షాలతో అల్లాడుతుంటే.. అక్కడ మాత్రం భానుడు భగభగమంటున్నాడు. భానుడి ఉగ్ర రూపాన్ని తట్టుకోలేక ఏకంగా రైలు పట్టాలే కాలిపోయాయి.

భారతదేశమంతా వర్షాలతో అల్లాడుతుంటే.. అక్కడ మాత్రం భానుడు భగభగమంటున్నాడు. భానుడి ఉగ్ర రూపాన్ని తట్టుకోలేక ఏకంగా రైలు పట్టాలే కాలిపోయాయి. ఈ షాకింగ్‌ ఘటన ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… లండన్‌లోని వాండ్స్‌ వార్త్‌ రోడ్‌, లండన్ విక్టోరియా మధ్య జూలై 11న రైలు పట్టాలపై అగ్గి రాజుకుంది. లండన్‌లో ఎండలు మండిపోతున్నాయి. 35 డిగ్రీలు దాటి అక్కడ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఎండ తీవ్రతకు రైలు పట్టాలపై మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని సౌత్‌ఈస్ట్రన్‌ రైల్వే ఎండీ స్టీవ్‌ వైట్ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. అయితే సకాలంలో సిబ్బంది స్పందించి మంటలను ఆర్పేసినట్లు తెలిపారు. ఈ ట్వీట్‌పై.. సిబ్బంది కూడా స్పందించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భానుడి ఉగ్రరూపం.. ఏకంగా రైలు పట్టాలే కాలిపోయాయి !! ఎక్కడంటే ??

పాములా మారుతున్న గొంగళిపురుగు !! వీడియో చూస్తా షాక్

Blood Jewellery: రక్తంతో ఆభరణాలు తయారీ.. అది కూడా మానవుని రక్తం తో !!

బయటకు వెళ్లే హడావుడిలో షూ వేసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త !!

Follow us on