కృష్ణా నదిలో తృటిలో తప్పిన పడవ ప్రమాదం వీడియో

Updated on: Nov 16, 2025 | 7:38 AM

కృష్ణా నదిలో తృటిలో పడవ ప్రమాదం తప్పింది. వేదాద్రి నుంచి గుంటూరు జిల్లా గింజపల్లి వైపు ప్రయాణిస్తున్న పడవలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజన్ బ్యాటరీ పనిచేయకపోవడంతో పడవ మార్గ మధ్యలో నిలిచిపోయింది. మరోవైపు నదీ ప్రవాహం వేగంగా ఉండడంతో పడవ కొంత దూరం కొట్టుకుపోయింది.. అది గమనించిన స్థానికులు పడవలో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.

ఎన్టీఆర్ జిల్లా వేదాద్రి నుండి గుంటూరు జిల్లా గింజపల్లి వరకు ప్రతిరోజు ప్రయాణికులు పడవలపై రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. రోజూలాగే శుక్రవారం కూడా కొందరు బోటులో ప్రయాణిస్తున్నారు. ఇంతలో బోటు ఇంజన్ బ్యాటరీ పనిచేయకపోవడంతో మధ్యలోనే ఆగిపోయింది. కృష్ణానది ప్రవాహం ఉధృతంగా ఉండటంతో పడవ కొంత దూరం కొట్టుకుపోయి నిలిచిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు బోటుకు లంగరు వేసి.. 30 మంది ప్రయాణికులతో సహా పడవని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగిందని నిర్వాహకులు తెలిపారు. పడవలోని ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో

మీ బ్యాంక్‌ ఎకౌంట్‌ భద్రమేనా? వీడియో

మోడల్‌ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us