Korean Woman: ఇండియన్ పిప్పరమెంట్ తిని కెవ్వ్వ్.. అన్న కొరియన్ యువతి.. ట్రెండ్ అవుతున్న ఫన్నీ వీడియో..
సాధారణంగా టాఫీలు, క్యాండీలు లేదా పిప్పిర్మెంట్లు తియ్యగా ఉంటాయి. ఇటీవల వీటిని రకరకాల ఫ్లేవర్స్ పేరుతో అసాధారణ అసిడిక్ ఫ్లేవర్స్ను కలుపుతూ భిన్న ఆకృతుల్లో తయారుచేస్తున్నారు.
సాధారణంగా టాఫీలు, క్యాండీలు లేదా పిప్పిర్మెంట్లు తియ్యగా ఉంటాయి. ఇటీవల వీటిని రకరకాల ఫ్లేవర్స్ పేరుతో అసాధారణ అసిడిక్ ఫ్లేవర్స్ను కలుపుతూ భిన్న ఆకృతుల్లో తయారుచేస్తున్నారు. దాంతో ఈ పిప్పరమెంట్లు కొన్ని తియ్యగా, కొన్ని తీపి, పులుపు కలబోతగా, ఇంకొన్ని తియ్యగా ఘాటుగా ఉంటాయి. అయితే భారతదేశంలోని ఈ అన్నిరకాల పిప్పర్మెంట్లు ఫేమస్సే.. కానీ, ఇటీవల ఘాటుగా ఉండే పల్స్ కంపెనీ పిప్పర్మెంట్ పేరు మారుమోగుతోంది. ఎందుకంటే, భారత్లో పిప్పర్మెంట్ల ప్రాముఖ్యతను తెలుసుకున్న హ్యోజియోంగ్ పార్క్ అనే కొరియన్ యువతి.. పల్స్ కంపెనీ పిప్పర్మెంట్ కొని తిని చూసింది. అంతే ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి. ఆ పిప్పరమెంట్ ఘాటును భరించలేక కెవ్వుమంటూ అరిచింది. నాలుక మంట ఓర్చుకోలేక ఏడ్చినంత పనిచేసింది. వీడియో బ్లాగర్ అయిన ఆ కొరియన్ యువతి ఈ వీడియోను ఇన్స్టాలో షేర్ చేసింది. ఇండియన్ క్యాండీ నన్ను ఏడిపించింది. దాన్ని నాకు ఎవరు రికమెండ్ చేశారు..? అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే లక్షలాదిమంది వీక్షిస్తూ లైక్ చేస్తూ తమదైన శైలిలో కామెంట్లు కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
