ట్రైన్లో సీటు దొరకలేదని ఆ మహిళ ఏం చేసిందో చూడండి
బస్సులో, ట్రైన్లో సీట్లకోసం జుట్టుపట్టుకొని కొట్టుకున్న ఘటనలు చూశాం. తాజాగా ఓ మహిళ మరో అడుగు ముందుకేసి తనకు సీటు ఇవ్వకపోతే అందరి కళ్లలో కారం కొడతానని బెదిరించింది. దాంతో ఓ ప్రయాణికురాలు ఆగ్రహంతో ఆ మహిళను అడ్డుకోగా ఆమె మరింత రెచ్చిపోయింది. ప్రయాణికులపై పెప్పర్ స్ప్రే చల్లేందుకు ప్రయత్నించింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు.పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ ఘటన జరిగింది. సీల్దా స్టేషన్లో లోకల్ ట్రైన్ ఎక్కింది ఓ మహిళ. అయితే ఆమెకు ట్రైన్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో సీటు దొరకలేదు. దాంతో ఆ మహిళ తీవ్ర అసహనానికి గురయింది. తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచెయ్యాలనుకుంది. అంతే ఈన బ్యాగులోనుంచి పెప్పర్ స్ప్రే తీసి ప్రయాణికుల ముఖంపై చల్లేందుకు ప్రయత్నించింది. ఓ మహిళ జోక్యం చేసుకొని ఆమెను ప్రతిఘటించడంతో మరింత రెచ్చిపోయిన ఆ మహిళ ఆ కంపార్ట్మెంట్ మొత్తం పెప్పర్ స్ప్రే చల్లింది. దీంతో కారం ఘాటుకు కొందరు ఇబ్బందులు పడ్డారు. చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఇదంతా చూసి మిగతా ప్రయాణికులు జోక్యం చేసుకున్నారు. ఆ మహిళను గట్టిగా నిలదీశారు. దాంతో దిగొచ్చిన మహిళ వారికి క్షమాపణ చెప్పింది. అనంతరం రైల్వే పోలీసులకు ఆమెను అప్పగించారు. కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో ఈ ఘటనను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఆ మహిళ తీరుపై మండిపడ్డారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్రతికుండగానే తన అంత్యక్రియలు చేసుకున్న వ్యక్తి.. ఆ తర్వాత
2026లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంతో తెలుసా ??
Kolkata’s Underwater Metro: దేశంలోని తొలి అండర్ వాటర్ మెట్రోను చూశారా
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

