పెంపుడు కుక్కకు మత్తు మందు ఇచ్చి మరీ.. ఆలా.. ఎలా చేశారురా..
కాకినాడ జిల్లా గొల్లపాలెంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పెంపుడు కుక్కకు మత్తుమందు కలిపిన బిస్కెట్లు వేసి స్పృహ తప్పించి, ఇంట్లో చొరబడ్డారు. ఇంటి యజమాని నేతి భగవాన్ పక్క ఇంట్లో ఉండగా, దొంగలు ల్యాప్టాప్తో పాటు కారును చోరీ చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెంలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇంట్లో పెంపుడు కుక్క ఉందని గ్రహించి దానికి మత్తు మందు కలిపిన బిస్కెట్లు వేసి స్పృహ కోల్పోయిన తర్వాత ఇంట్లో ప్రవేశించారు దుండగులు. ఇంటిలోని ల్యాప్టాప్తోపాటు ఇంటి ఆవరణలో నిలిపిన కారుతో ఉడాయించారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. గొల్లపాలెం గ్రామానికి చెందిన నేతి భగవాన్ ఇంటికి మరమ్మతులు చేయించే క్రమంలో పక్క ఇంట్లో ఉంటున్నారు. అర్ధరాత్రి పన్నెండు గంటల తరవాత కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఇంట్లో చోరీకి వచ్చారు. ఆ ఇంటి అరుగుపై పడుకొని ఉన్న శునకం దొంగల అలికిడికి లేచింది. వెంటనే దొంగలు ఆ కుక్కకు మత్తుమందు కలిపిన బిస్కెట్లు వేశారు. ఆ బిస్కెట్లు తిన్న శునకం వెంటనే మత్తులోకి జారుకుంది. అనంతరం చప్పుడు కాకుండా దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. అయితే అక్కడ విలువైన వస్తువులేవీ కనిపించకపోవడంతో అక్కడే ఉన్న ల్యాప్ట్యాప్ను ఎత్తుకొని, ఇంటి ముందు పార్క్ చేసిన హ్యుందాయ్ వెన్యూ కారుతో ఉడాయించారని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున చోరీ జరిగినట్లు గ్రహించిన భగవాన్ పోలీసులకు సమాచారం అందించడంతో క్లూస్ సీఐ పి. శ్రీనివాస్, ఎస్సై ఎం.మోహన్ కుమార్ సిబ్బందితో కలిసి ఆధారాలు సేకరించారు. పెంపుడు శునకాన్ని పశు వైద్యులు పరీక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.26 వేల జీతం.. రూ.70 వేల ఐఫోన్.. మండిపడుతున్న నెటిజన్లు
Samantha: నిశ్చితార్థం ఎప్పుడో చేసుకుంది! కాకపోతే హింట్ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలే
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

