దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో
హనుమకొండ జిల్లా, కమలాపూర్ మండలం, వంగపల్లి గ్రామానికి చెందిన చిలువేరు ప్రశాంత్ ఆన్లైన్ గేమ్లకు అలవాటుపడి నష్టపోయాడు. జూదాల కోసం అప్పులు చేసి వాటిని తీర్చేందుకు దొంగతనాలకు అలవాటుపడ్డాడు. వంగపల్లి గ్రామంలో అందరితో కలివిడిగా ఉంటూనే వారి ఇళ్లలో చోరీలకు పాల్పడటం మొదలుపెట్టాడు. ఇలా కొద్ది రోజుల క్రిందట తన దగ్గరి మిత్రుడైన కోడెపాక మధుసూధన్ ఇంట్లో చోరీకి పాల్పడి 60 వేలు విలువచేసే బంగారం ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత పశువుల రమాదేవి ఇంటికి తాళం వేసి ఉడగ, అందులోను చొరబడి రెండు లక్షలు విలువచేసే నగలు దోచుకెళ్లాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా భార్యతో కలిసి కమలాపూర్ స్టేషన్ కి వెళ్లి మరి పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. వి
చారణలో పోలీసులకు అన్ని పిట్టసంగతులు చెప్పి దర్యాప్తును దారి మళ్ళించాడు. చోరీలకు అలవాటుపడిన చిలువేరు ప్రశాంత్ మే 30న ఎలికటి దిలీప్ ఇంట్లో దొంగతనాలకు వెళ్ళాడు. ఆ సమయంలో ఇంట్లో దివ్య అనే గర్భిణి అతన్ని గమనించింది. దీంతో తన భాగోతం బయటపడుతుందని భావించిన ప్రశాంత్ ఆమెను చంపేందుకు ప్రయత్నం చేశాడు. కొడవలితో తలపై దాడి చేశాడు. ఆమె చనిపోయిందనుకొని ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత ఏమి తెలియనట్లుగానే వెనక్కి వచ్చి భార్యతో కలిసి కమలాపూర్ ఆసుపత్రికి కాల్ చేశాడు. తనే దగ్గరుండి గాయపడిన గర్భిణిని గ్రామస్తులతో కలిసి కమలాపూర్ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా ఆసుపత్రికి వెళ్ళాక స్పృహలోకి వచ్చిన గర్భిణి తనపై చిలువేరు ప్రశాంత్ దాడి చేసినట్లు కుటుంబ సభ్యులకు తెలిపింది. భాధితురాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు.
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..

