ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
కొన్ని మారుమూల ప్రాంతాల్లో మూఢనమ్మకాలతో కొందరు క్షుద్రపూజలు చేయటం గురించి మీరు వినే ఉంటారు. కానీ, ఇటీవల కాలంలో పట్టణ ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా, గుంతకల్లులోని బాగా రద్దీగా ఉండే కాలనీలోని ఓ ఇంటి ముందు వేసిన ఓ వింత ముగ్గును చూసి ఆ దారిన వెళ్లే వారంతా భయంతో వణికి పోయారు.
అది ఖచ్చితంగా క్షుద్రపూజల తాలూకూ ముగ్గేనని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గుంతకల్లులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. శనివారం అర్ధరాత్రి పట్టణంలోని రామచంద్రప్ప అనే వ్యక్తి ఇంటి ముందు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు.. వింత ముగ్గు వేసి.. అందులో పసుపు, కుంకుమ, నిమ్మకాయల వంటివి పెట్టి పూజలు చేశారు. ఆ దారి వెంట వెళ్లిన వారు వాటిని చూసి భయపడి.. ఇంటి యజమానిని అలెర్ట్ చేశారు. కాగా, తాను కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాపై పోరాటం చేస్తున్నందుకే తన ఇంటి ముందు క్షుద్రపూజలు చేశారని, భూ కబ్జాలపై పోరాటం చేస్తున్న తనను ఇప్పటికే కొందరు బెదిరిస్తున్నారని, వారే ఇలాంటి పనిచేసి ఉండొచ్చని రామచంద్రప్ప అనుమానం వ్యక్తం చేశారు. తాను ఇలాంటి వాటికి భయపడనని.. క్షుద్ర పూజల ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని రామచంద్రప్ప పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్వా! డాక్టర్పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

