శేషాచలం అడవుల్లో పాము పోలికలతో కొత్త జీవి వీడియో
శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్ జీవవైవిధ్యానికి పెట్టింది పేరు. తాజాగా, ఈ అటవీ ప్రాంతంలో జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు అరుదైన జీవిని కనుగొన్నారు. చూసేందుకు పామును పోలి ఉండే ఈ జీవి స్కింక్ నలికిరి జాతిలో కొత్త రకంగా గుర్తించారు. చర్మంపై చారలు, పాక్షికంగా పారదర్శక కనురెప్పలు ఉండటం దీని ప్రత్యేకత.
ఆకట్టుకునే ఈ జీవికి ‘డెక్కన్ గ్రాసైల్ స్కింక్’ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ ధ్రితి బెనర్జీ తాజాగా ప్రకటించారు. ఈ అరుదైన జాతి ప్రస్తుతం కేవలం రెండు ప్రాంతాల్లోనే నివసిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. శేషాచలంతో పాటు తెలంగాణలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో కూడా కనిపించందన్నారు. ఇది భారతదేశం అడవుల్లో ఇప్పటికీ అన్వేషించాల్సిన ఎన్నో రహస్యాలను సూచిస్తోందని బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇక ఈ పరిశోధనలో జడ్ఎస్ఐ హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం, కోల్కతా రెప్టిలియా విభాగం, లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
మరిన్ని వీడియోల కోసం :