Mahanandi: లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది ఎన్నో అద్భుతాలకు నిలయం. వాటిలో ఇక్కడి కోనేరు ఒకటి. ఈ కోనేరులో కాలాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. కార్తీకమాసం పురస్కరించుకొని ఆలయ కోనేటికి గంగా హారతి నిర్వహించారు. ఈ క్రమంలో కోనేరులో నీటి స్వచ్చత మరోసారి రుజువైంది. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన గంగా హారతి సందర్భంగా ఓ భక్తుడు తీసిన వీడియో వైరల్ గా మారింది.
ఈ కోనేరును రుద్రగుండం అని పిలుస్తారు. ఎంతో స్వచ్ఛంగా ఉండే ఈకోనేటి నీటిలో అలయ గోపురాలు ప్రతిబింబాలు ఎంతో స్పష్టంగా కనపడ్డాయి. అద్దంలో కనబడుతున్నట్టుగా ఉన్న ఆ దృశ్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా కోనేరు విశిష్ఠతను తెలియజేసిన ఆలయ అధికారులు ఈ కోనేరులో ఒక చిన్న గుండుసూది పడినా ఎంతో స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. ఈ క్షేత్రంలో ఎండాకాలం అయిన వాన కాలం అయిన ఏ కాలం అయిన నీటి ప్రవాహం ఒకే విధంగా వుండటం ఇక్కడ విశేషం. అందుకే ఈ ఆలయంకు తీర్థ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం, ఇక్కడి కోనేరు గురించి స్కందపురణాంలో ఉందనీ, ఈ క్షేత్రంలోని నీరు ఐదుధారలుగా నిత్యం ప్రవహిస్తూ ఉంటుందని స్కందపురాణం,శివ పురాణంలో చెప్పినట్లు ప్రదాన అర్చకులు చెబుతున్నారు. క్షేత్రంలోని కోనేరులో స్నానం చేస్తే ఎలాంటి రోగాలైనా నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

