మరోసారి మానవత్వం సిగ్గుపడే ఘటన తెరపైకి వచ్చింది.. ఇటీవలే తిరుపతిలో కొడుకు మృతదేహాన్ని తరలించేందుకు తండ్రి పడిన ఆరాటం కంటతడి పెట్టించింది. తాజాగా అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అమంగ్నాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్పూర్ గ్రామ నివాసి అయిన ఐదేళ్ల బాలుడు సౌరభ్ చౌదరికి న్యూమోనియా సోకింది. దీంతో బాలుడు తండ్రి ఫులారే చౌదరి జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చాడు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించాడు. చిన్నారి మృతదేహాన్ని తమ స్వగ్రామం తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు అంబులెన్స్ ఇవ్వమని అధికారులు, వైద్య సిబ్బంది చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా ఆసుపత్రి సిబ్బంది స్పందించకపోవంతో.. బాలుడు మృతదేహాన్ని తండ్రి ఒడిలో పెట్టుకుని మోటార్సైకిల్పై తమ ఇంటికి తీసుకెళ్లారు. ఆ బాలుడి కోసం తండ్రి పడ్డ ఆరాటాన్ని చూసిన స్థానికులు.. కంటతడి పెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..