Elephant Viral Video: ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

|

Jun 16, 2024 | 12:20 PM

స్థానిక పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 11:30 గంటల సమయంలో భన్‌పూర్ వంతెన సమీపంలోని చోళ్ల మందిర్ పోలీస్ స్టేషన్ వద్ద చెట్టుకు కట్టి ఉంచిన ఓ ఏనుగు స్థానిక బ్రిడ్జి వద్ద నిద్రపోతున్నవారిపై దాడి చేసిందని, వారిలో మహౌట్‌ నరేంద్ర కపాడియా అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఏనుగుతో కొందరు చుట్టుపక్కల పల్లెల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నట్టు చెప్పారు.

కోతులు, ఒంటెలు, గంగిరెద్దులను వెంటతీసుకొని కొందరు భిక్షాటన చేస్తారు..అలాంటి ఓ ఏనుగు కొందరిపై దాడికి పాల్పడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. దాంతో ఆ ఏనుగుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ ఘటన భోపాల్‌లో చోటుచేసుకుంది. స్థానిక పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 11:30 గంటల సమయంలో భన్‌పూర్ వంతెన సమీపంలోని చోళ్ల మందిర్ పోలీస్ స్టేషన్ వద్ద చెట్టుకు కట్టి ఉంచిన ఓ ఏనుగు స్థానిక బ్రిడ్జి వద్ద నిద్రపోతున్నవారిపై దాడి చేసిందని, వారిలో మహౌట్‌ నరేంద్ర కపాడియా అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఏనుగుతో కొందరు చుట్టుపక్కల పల్లెల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నట్టు చెప్పారు. ఇదే క్రమంలో భోపాల్ నగరంలోని భన్‌పూర్ బ్రిడ్జ్ సమీపంలో తిరిగేందుకు ఏనుగును తీసుకువచ్చారు. కాగా, అక్కడికి సమీపంలో కొందరు నిద్రపోతున్నారు. ఈ క్రమంలో వారిపై ఏనుగు దాడి చేనట్టు తెలిపారు. ఏనుగు ఒక్కసారిగా కోపోద్రిక్తంగా మారి కపాడియాను తొక్కి చంపేసిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అతడిని కాపాడేందుకు తాము ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఏనుగు దాడి ముందు ఏమీ చేయలేకపోయామని తెలిపారు. దీనిపై అధికారులు అటవీశాఖతో సమన్వయం చేసుకుని ఏనుగును తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ సురేష్ చంద్ర నగర్ వివరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on