బోర్డు తిప్పేసిన దుబాయ్ కంపెనీ.. భారతీయులకు కుచ్చుటోపీ వీడియో
దుబాయ్ లో ఒక బ్రోకరేజ్ సంస్థ రాత్రికి రాత్రే దుకాణం ఎత్తేయడంతో పెట్టుబడిదారులు లబోదిబోమంటున్నారు. బోర్డు తిప్పేసిన సంస్థలో ప్రవాస భారతీయులు కొందరు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుంది. కొన్ని కోట్ల దిర్హంలతో ఉదయించిన కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ సంస్థలో పెట్టుబడులు పెట్టాలని ఫోన్ కాల్స్ ద్వారా తమని సంప్రదించినట్లు కేరళకు చెందిన ప్రవాసులు మొహమ్మద్ ఫయాజ్ పోయెల్ తెలిపారు.
ఇద్దరు కలిసి ఉమ్మడిగా సంస్థలో దాదాపు 75 వేల డాలర్ల వరకు పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోయారు. దుబాయ్ లోని ప్రతిష్టాత్మక బిజినెస్ బే ప్రాంతంలో ఈ సంస్థ కార్యాలయం తెరిచింది. 40 మంది సిబ్బందితో పెద్ద బిల్డప్ ఇచ్చింది. సంస్థ నుంచి సడన్ గా కాల్స్ ఆగిపోవడంతో సంస్థ కార్యాలయానికి వెళ్ళిన మొహమ్మద్ ఫయాజ్ పోయెల్ షాక్ కు గురయ్యారు. మొన్నటి వరకు 40 మంది సిబ్బంది పనిచేసిన బ్రోకరేజ్ సంస్థ కార్యాలయం ఖాళీగా దర్శనం ఇచ్చింది. మొదట్లో భారీ స్థాయిలో లాభాలు రావడంతో చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని వారు తెలిపారు.
Follow Us
వైరల్ వీడియోలు
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్వా! డాక్టర్పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

