బోర్డు తిప్పేసిన దుబాయ్ కంపెనీ.. భారతీయులకు కుచ్చుటోపీ వీడియో
దుబాయ్ లో ఒక బ్రోకరేజ్ సంస్థ రాత్రికి రాత్రే దుకాణం ఎత్తేయడంతో పెట్టుబడిదారులు లబోదిబోమంటున్నారు. బోర్డు తిప్పేసిన సంస్థలో ప్రవాస భారతీయులు కొందరు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుంది. కొన్ని కోట్ల దిర్హంలతో ఉదయించిన కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ సంస్థలో పెట్టుబడులు పెట్టాలని ఫోన్ కాల్స్ ద్వారా తమని సంప్రదించినట్లు కేరళకు చెందిన ప్రవాసులు మొహమ్మద్ ఫయాజ్ పోయెల్ తెలిపారు.
ఇద్దరు కలిసి ఉమ్మడిగా సంస్థలో దాదాపు 75 వేల డాలర్ల వరకు పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోయారు. దుబాయ్ లోని ప్రతిష్టాత్మక బిజినెస్ బే ప్రాంతంలో ఈ సంస్థ కార్యాలయం తెరిచింది. 40 మంది సిబ్బందితో పెద్ద బిల్డప్ ఇచ్చింది. సంస్థ నుంచి సడన్ గా కాల్స్ ఆగిపోవడంతో సంస్థ కార్యాలయానికి వెళ్ళిన మొహమ్మద్ ఫయాజ్ పోయెల్ షాక్ కు గురయ్యారు. మొన్నటి వరకు 40 మంది సిబ్బంది పనిచేసిన బ్రోకరేజ్ సంస్థ కార్యాలయం ఖాళీగా దర్శనం ఇచ్చింది. మొదట్లో భారీ స్థాయిలో లాభాలు రావడంతో చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని వారు తెలిపారు.
Follow Us
వైరల్ వీడియోలు
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

