Hyderabad: అర్థరాత్రి హైటెన్షన్‌ స్థంభం ఎక్కి హల్ చల్ చేసిన వ్యక్తి.. ఏం జరిగిందంటే.!

Updated on: Feb 24, 2024 | 6:31 PM

అర్ధరాత్రి హైటెన్షన్‌ స్థంభంపై వ్యక్తిని చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని కిందకి దించేందుకు ముప్పుతిప్పలు పడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి మీర్‌పేట్‌లో జరిగింది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా వద్ద మద్యం మత్తులో హై టెన్షన్ విద్యుత్ స్తంభం పైకి ఎక్కేసాడు.

అర్ధరాత్రి హైటెన్షన్‌ స్థంభంపై వ్యక్తిని చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని కిందకి దించేందుకు ముప్పుతిప్పలు పడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి మీర్‌పేట్‌లో జరిగింది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా వద్ద మద్యం మత్తులో హై టెన్షన్ విద్యుత్ స్తంభం పైకి ఎక్కేసాడు. విద్యుత్‌ స్తంభంపై అతడిని గమనించిన స్థానికులు కిందకి దిగమని చెప్పినా అతను దిగలేదు. చేసేదిలేక వారు పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని కిందకి దిగమని ఎంత చెప్పినా వినలేదు. రెండు గంటలపాటు పోలీసులకు చుక్కలు చూపించాడు. అతన్ని కిందకి దించడానికి ముప్పు తిప్పలుపడ్డారు. ఈ క్రమంలో స్థానికంగా భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. చివరికి పోలీసులే విద్యుత్‌ స్తంభంపైకి ఎక్కి మందుబాబును జాగ్రత్తగా కిందకు దించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Loading...
Unable to load recommendations.
Follow Us