Viral: సర్జరీ చేసి బాలింత కడుపులో కాటన్‌ వదిలేసిన డాక్టర్లు.. మూత్రం ఆగిపోవడంతో అనుమానం.

Updated on: Aug 31, 2023 | 10:07 PM

మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ బాలింత ప్రాణాల మీదకొచ్చింది. వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన కీర్తి లయ అనే గిరిజన మహిళకు పురిటి నొప్పులతో ఐదు రోజుల క్రితం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆపరేషన్ చేయగా.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కాన్పు అయిన ఐదు రోజుల తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కీర్తిలయను డిశ్చార్జ్ చేశారు.

మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ బాలింత ప్రాణాల మీదకొచ్చింది. వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన కీర్తి లయ అనే గిరిజన మహిళకు పురిటి నొప్పులతో ఐదు రోజుల క్రితం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆపరేషన్ చేయగా.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కాన్పు అయిన ఐదు రోజుల తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కీర్తిలయను డిశ్చార్జ్ చేశారు. అయితే ఆ బాలింతకు మూత్రవిసర్జన కాకపోవడంతో.. తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో హుటాహుటిన చెన్నూరు ఆస్పత్రికి తరలించారు. ఆమె కడుపులో కాటన్ ప్యాడ్ గుర్తించిన వైద్యులు.. వెంటనే తొలగించి తిరిగి కుట్లు వేశారు. చికిత్స అందించిన చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు బాలింత కడుపులో కాటన్ గుర్తించారు.. కాటన్ తొలగించి తిరిగి కుట్లు వేశారు. ప్రస్తుతం చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రి లో బాలింత కోలుకుంటోంది. నిర్లక్ష్యంగా ప్రవర్తించి బాలింత ప్రాణాల మీదకు తెచ్చిన మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ.. బాలింత బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..