అదో ఉడిపి హోటల్.. ఇంకేముంది ముందు వెనుక ఏం ఆలోచించకుండా వెళ్లి వెంటనే టిఫిన్ ఆరగించేస్తారు అలా తెలంగాణలోని జగిత్యాల జిల్లా కేంద్రంలో వెళ్లిన ఓ కస్టమర్ కు షాకింగ్ సంఘటన ఎదురైంది. ఓ కస్టమర్ తన పిల్లలను వెంటబెట్టుకొని ఉడిపి హోటల్ కు వెళ్లి ఇడ్లీ ఆర్డర్ చేశాడు. వెయిటర్లు కూడా వెంటనే ఇడ్లీలు ప్లేట్లో పెట్టి ఇచ్చేశారు. ఇలా వాటిని పిల్లలకు తినిపిస్తున్న క్రమంలో ఇడ్లీలో జెర్రి కనిపించింది. ఇది చూసి కంగుతిన్న కస్టమర్ .. వెంటనే యజమాని దృష్టికి తీసుకెళ్లాడు. ఇదే షాకింగ్ ఘటన అనుకుంటే.. దానికి ఓనర్ రియాక్షన్ చూసి.. హోటళ్లో వాళ్లంతా ఇంకా షాకయ్యారు. చోటుచేసుకుంది.
జగిత్యాల జిల్లా కేంద్రంలో గణేష్ భవన్ ఉడిపి హోటల్లో ఓ కస్టమర్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాడు.. ఆ తర్వాత ఇడ్లీలను పిల్లలకు తినిపించే సమయంలో చనిపోయిన జెర్రి కనిపించింది. విషయం హోటల్ యజమాని దృష్టికి తీసుకెళ్లాడు. అతను అది జెర్రీ కాదంటూ బుకాయించాడు. దీంతో ఓనర్తో కస్టమర్ వాగ్వాదానికి దిగాడు. ఈక్రమంలో అది జెర్రీ కాదని వాదిస్తూ ఓనర్ దానిని నోట్లో వేసుకున్నాడు. అది జెర్రీ అని తేలడంతో ఓనర్ ఉమ్మేశాడు. వెంటనే అప్రమత్తమైన హోటల్ నిర్వాహకులు ఇడ్లీలను బల్దియా ట్రాక్టర్లో తరలించే ప్రయత్నం చేశారు. దీంతో కస్టమర్ అడ్డుకుని ఇడ్లీలతో రోడ్డు పై బైఠాయించాడు.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.