Robbery Video: మాస్క్‌లతో వచ్చారు.. రూ. కోటీ నగదుతో జంప్‌ అయ్యారు.! నెట్టింట వైరల్ అవుతున్న సీసీ టీవీ ఫోటేజ్..

|

Feb 15, 2022 | 6:13 PM

ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఎప్పుడూ.. ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తాజాగా జరిగిన ఓ ఘటన దేశంలోనే కలకలం రేపింది. తుపాకులతో ఓ కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగులు.. పాయింట్ బ్లాక్‌లో గన్ను పెట్టి కోటి రూపాయిలు దోచుకెళ్లారు.


ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఎప్పుడూ.. ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తాజాగా జరిగిన ఓ ఘటన దేశంలోనే కలకలం రేపింది. తుపాకులతో ఓ కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగులు.. పాయింట్ బ్లాక్‌లో గన్ను పెట్టి కోటి రూపాయిలు దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఈ ఘటన ముంబైలోని ములుంద్ ప్రాంతంలోని ఓ సంస్థ కార్యాలయంలో చోటుచేసుకుంది. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు గన్నులతో వచ్చారు. అనంతరం అక్కడున్న వారిని బెదిరించి కోటి రూపాయల నగదుతో పారిపోయారు. పంచ రాస్తా ప్రాంతంలో ఆర్థిక సేవలు నిర్వహించే దుకాణంలో ఈ ఘటన జరిగింది. ఈ దోపిడీ ఘటన మొత్తం కార్యాలయంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయినట్లు పోలీసులు తెలిపారు.మాస్క్‌లు ధరించిన ముగ్గురు దుండగులు కార్యాలయంలోకి ప్రవేశించి పిస్టల్స్ సహాయంతో ఉద్యోగులను బందీలుగా పట్టుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. అనంతరం కార్యాలయంలో ఉంచిన నగదును బ్యాగులో వేసుకొని దోచుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Ranveer Singh: అమ్మాయిల కలల రాకుమారుడు.. నెట్టింట వైరల్ అవుతోన్న మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఫోటోలు.

Krithi shetty Rare and childhood Photos: బేబమ్మ అరుదైన ఫొటోస్ కలెక్షన్.. ఈ రేంజ్ ‘కృతి శెట్టి’ ని ఉహించి ఉండరు…(ఫొటోస్)

Hero Venu Reentry: టాలెంటెడ్ హీరో రీఎంట్రీ.. ఇంతకాలం ఎం అయ్యింది వేణుకి..? రవితేజ మూవీలో కీలకపాత్రలో..వీడియో

MLA Talari VenkatrRao: ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి..! కూర్చుని ఉంటే ఒళ్లు పెరుగుతుందని.. వ్యవసాయం చేస్తూ…వీడియో

Follow us on