సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల రెండు సైబర్ మోసాల కేసులలో బాధితుల డబ్బును కాపాడటంలో "గోల్డెన్ అవర్" ఎంత కీలకమో నిరూపించారు. సకాలంలో ఫిర్యాదు చేసిన కారణంగా మొత్తం 6.23 లక్షల రూపాయలను తిరిగి రాబట్టగలిగారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రెండు కేసుల్లో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతను నిరూపించారు. బాధితులు తక్షణమే ఫిర్యాదు చేయడంతో మొత్తం రూ. 6.23 లక్షలు రికవరీ అయ్యాయి. ఏపీకే ఫైళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసం జరిగిన వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. సకాలంలో స్పందించడం ద్వారా ఆర్థిక నష్టాలను నివారించవచ్చని తెలియజేసారు.
డిసెంబర్ 5న, యూసఫ్గుడాకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు వాట్సాప్లో నకిలీ ట్రాఫిక్ ఫైన్ మెసేజ్ వచ్చింది. M-Parivahan పేరుతో వచ్చిన APK ఫైల్ను అతను తెలియక ఇన్స్టాల్ చేయడంతో, సైబర్ నేరగాళ్లు అతని మొబైల్ నుంచి OTPలను దొంగిలించి 5.23 లక్షల రూపాయలకు పైగా లావాదేవీలు జరిపారు. వెంటనే అప్రమత్తమైన బాధితుడు 1930 హెల్ప్లైన్కు కాల్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేశాడు.
మరిన్ని వీడియోల కోసం :
