ఓ వ్యక్తి పొట్టలో ఒకటిన్నర లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలను పోలీసులు గుర్తించారు. తాజాగా రంజాన్ పండుగను జరుపుకోవడానికి ఓ మహిళ తన మిత్రుడు, అతడి భార్యను ఇంటికి ఆహ్వానించారు. బిర్యానీని వడ్డించి వంటగదిలోకి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన అతడు అక్కడే ఉన్న బంగారు నెక్లెస్, గొలుసు, ఇతర ఆభరణాలను బిర్యానీలో కలుపుకొని తిన్నా డు. వంటగది నుంచి వచ్చిన మహిళ ఆభరణాలు కన్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఆమె మిత్రుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లి పరిశీలించగా పొట్టలో ఆభరణాలు కనిపించాయి. డాక్టర్లు ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కీర్తి పక్కనే ఉన్న ఈ అమ్మాయి ఎవరు ?? అందరూ ఈమె వెంట ఎందుకు పడుతున్నారు
RRR OTT: RRR ఓటీటీ ట్రైలర్ వచ్చేసింది.. మళ్లీ రికార్డులు బద్దలు కొడుతోంది