కర్నూల్ జిల్లాలోని డోన్ ఫ్లైఓవర్ పై ప్రమాదం చోటు చేసుకొంది. ప్లై ఓవర్ రెయిలింగ్ ను ఢీకొట్టిన బస్సు ఫ్లై ఓవర్ అంచున ప్రమాదకరంగా నిలిచిపోయింది. ఆ సమయంలో బస్సుల్లో ఉన్న ప్రయాణికులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు దూకేశారు… అక్కడున్న వాహనదారులు, ప్రయాణికులు భయంతో వణికిపోయారు. కర్నూల్ జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. డోన్లో ఫ్లైఓవర్ పై సేఫ్టీ వాల్ ను బస్సు ఢీకొనడంతో పెచ్చులు కింద పడ్డాయి. దీంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. డోన్ పట్టణంలో రైల్వే ట్రాక్ ఉంది. దీంతో రైళ్లు వెళ్లే సమయంలో గేటు వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో డోన్ లో ఫ్లైఓవర్ ను నిర్మించారు. ఇదే ప్రాంతంలో మార్కెట్ కూడా ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video : పెళ్లి మండపంలో.. నవ దంపతుల చిలిపి పనులు..!! వీడియో
Viral Video: చెట్టు మధ్యలో చిక్కుకున్న ఆవు..!! శభాష్ రెస్క్యూ టీమ్.. వీడియో
Viral Video: భయ్యా.. ఏంటా క్యాచ్.. దిమ్మతిరిగిపోయింది.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో