సంపద లెక్కింపును లైవ్ టెలికాస్ట్ చేయాలని భక్తుల డిమాండ్
ఉత్తరప్రదేశ్లోని మధురలో ప్రసిద్ధ బాకే బిహారీ ఆలయ భాండాగారం 54 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో తెరుచుకుంది. ఆలయ సంపద లెక్కింపు జరుగుతుండగా, భక్తులు ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో దొరికిన సంపద, అనంత పద్మనాభ ఆలయంతో పోలికలు ఆసక్తిని రేపుతున్నాయి.
ఉత్తరప్రదేశ్లోని మధురలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాకే బిహారీ ఆలయ భాండాగారం 54 ఏళ్ల తర్వాత తెరుచుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయనిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో ఈ సంపద లెక్కింపు జరుగుతోంది. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం వలె, బాకే బిహారీ ఆలయంలోనూ అపారమైన సంపద ఉందని భక్తులు నమ్ముతారు. దేవాలయం గర్భగుడి కింద ఉన్న ఈ ఖజానాలో ఎంతో విలువైన ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
