గుడికి వెళుతుండగా చైన్‌ స్నాచింగ్‌ సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌

Updated on: Nov 08, 2025 | 9:40 AM

కార్తీక పౌర్ణమి రోజున చైన్‌ స్నాచర్లు రెచ్చిపోయారు. తెల్లవారుజామున పుణ్య స్నానం ఆచరించి పూజలు చేసేందుకు ఓ మహిళ ఆలయానికి బయలు దేరింది.. ఇంతలోనే.. ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు వెనుక నుంచి బైక్ పై అటుగా వచ్చారు. ఆమె వారిని గమనించకుండా.. గుడికి వెళుతోండగా, క్షణాల్లో వారిలో ఒకడు ఆమె మెడలోని బంగారు గొలుసు గుంజుకుని పారిపోయారు.

ఈ చైన్ స్నాచింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా గుడికి వెళుతున్న మహిళ మెడలోని గోల్డ్ చైన్ ను ఇద్దరు దుండగులు లాక్కొని పారిపోయారు. కొవ్వూరు నగర్‌లో మాధవీలత అనే మహిళ తెల్లవారుజామున నడుచుకుంటూ గుడికి వెళుతుండగా.. బైక్ పై ముసుగులు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు.. ఆమె మెడలోని ఐదు తులాల బంగారు గొలుసును లాక్కెళ్ళారు. ఆమె తేరుకునేలోపే రెడిగా వున్న బైక్ ఎక్కి పరారయ్యారు. గొలుసును లాక్కుని వెళుతుండగా.. బాధితురాలు మాధవీలత కిందపడింది.బాధిత మహిళ అసలేం జరిగిందో కూడా ఊహకందక దిగ్భ్రాంతికి గురయ్యింది. కొద్దిసేపటికి షాక్ నుండి బయటకు వచ్చిన ఆమె కుటుంబసభ్యులకు విషయం తెలిపి పోలీసులను ఆశ్రయించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భయం భయంగా తిరుమలకు శ్రీవారి భక్తులు

కార్తీక పౌర్ణమి సందర్భంగా శివయ్యకు ఓ భక్తురాలి నివేదన.. ఏం చేసిందంటే

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. ఇక అధిక బిల్లుల బాధే ఉండదు

మరో ఆర్టీసీ బస్సు దగ్ధం.. ప్రయాణికులంతా సేఫ్

ఆ పాత్రికేయుడి విగ్రహానికి ముద్దులతో మహిళల నివాళి.. ఎందుకో తెలుసా ??