టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఆసక్తిక విషయాలు పంచుకున్నారు. తాజాగా ఆయన 4వ అటల్ బిహారీ వాజ్పేయి మెమోరియల్ లెక్చర్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తన జీవితంలో జరిగిన అద్భుత సంఘటన గురించి వివరించారు. అదే తనకు జీవిత గుణపాఠమైందన్నారు. తన సక్సెస్కు కారణమైందని వివరించారు. ఇంతకీ ఏంటా సంఘటన? ఆనంద్ మహీంద్రా తన స్పీచ్లో భాగంగా ఏడాది వయసున్నప్పుడు తన కూతురి చేతివేలి ఆపరేషన్ తనకు ఎలాంటి పాఠం నేర్పిందో వివరించారు. 1987లో ఏడాది వయసున్న తన చిన్న కూతురు ఓ చిన్న గాజుసీసా పట్టుకొని ఆడుకుంటూ కిందపడిపోవడంతో గాజుముక్క ఆమె చేతి వేలికి గుచ్చుకుని వేలులోపలి కండ తెగిపోయిందని తెలిపారు. ఆ సమయంలో తాను ఎంతో కంగారుపడిపోయి, వెంటనే ఎవరో ఇచ్చిన సలహాతో లండన్లోని ప్రముఖ మైక్రోసర్జరీ డాక్టర్ను సంప్రదించానని, ఆయన పాపకు ఆపరేషన్ చేసి, చిన్నారి కోలుకునేందుకు చేయి కదల్చలేని విధంగా చేయి చుట్టూ ఓ కాస్ట్ వేశారని, నెల రోజుల తర్వాత కాస్ట్ తీస్తే తన కూతురు చేతివేలు కదపలేకపోయిందన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రెడిట్ కార్డు హోల్డర్స్కి అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్
పాకిస్థాన్లోని గ్వాదర్ పోర్ట్పై ఉగ్రదాడి
డీప్ఫేక్పై ఇటలీ ప్రధాని కొరడా.. రూ.90 లక్షల పరువు నష్టం దావా