Pan Card Alert: పాన్‌ కార్డు దారులకు అలర్ట్.! డిసెంబర్‌ 31 లోపు అది చెయ్యాల్సిందే..

Updated on: Nov 11, 2024 | 1:42 PM

ప్రస్తుతం పాన్ కార్డు వినియోగం అనివార్యంగా మారింది. బ్యాంకు ఖాతా ఉన్న ప్రతీ ఒక్కరికీ పాన్ కార్డ్ ఉండాల్సిందే. ఈ నేపథ్యంలోనే పాన్ కార్డు ఉపయోగిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పాన్‌కార్డును ఆధార్‌ కార్డుతో లింక్ చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు అలర్ట్‌ చేసింది. ఆర్థిక మోసాలను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

పాన్ కార్డు వినియోగం అనివార్యంగా మారింది.. అందుకే పాన్‌కార్డును ఆధార్‌ కార్డుతో లింక్ చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు అలర్ట్‌ చేసింది. ఇందుకుగాను ఇచ్చిన గడువు కూడా ముగిసింది. అయితే ప్రస్తుతం ఎవరైనా ఆధార్‌,పాన్‌ లింక్‌ చేసుకోకపోతే జరిమానాతో లింక్‌ చేసుకునే అవకాశం ఉంది. అయితే తాజాగా ఇందుకు సంబంధించి మరో కీలక ప్రకటన చేశారు. వచ్చే డిసెంబర్‌ 31వ తేదీలోపు పాన్‌ కార్డులను ఆధార్ కార్డులతో కచ్చితంగా లింక్‌ చేసుకోవాలని తేల్చి చెప్పారు. లింక్‌ చేయని పాన్‌ కార్డులు డిసెంబర్ 31వ తేదీ తర్వాత డీయాక్టివేట్‌ అవుతాయని ప్రకటించారు. ఆ తర్వాత కొత్త పాన్‌ కార్డ్ తీసుకోవడం తప్ప మరో అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అయితే ఇందులోనూ పలు సమస్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow Us