Mother – 6 children: ఆరుగురు పిల్లలను చంపిన తల్లి.. అందరినీ బావిలోకి నెట్టి.. కారణం..?

|

Jun 07, 2022 | 8:15 PM

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఆరుగురు పిల్లలను ఒక్కొక్కరిగా బావిలోకి నెట్టి.. వారు చనిపోవడాన్ని చూస్తూ బయట కూర్చుంది. ఈ విషాద ఘటన రాయగడ జిల్లా మహద్ తాలూకా బోర్వాడి గ్రామంలో సోమవారం జరిగింది.


మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఆరుగురు పిల్లలను ఒక్కొక్కరిగా బావిలోకి నెట్టి.. వారు చనిపోవడాన్ని చూస్తూ బయట కూర్చుంది. ఈ విషాద ఘటన రాయగడ జిల్లా మహద్ తాలూకా బోర్వాడి గ్రామంలో సోమవారం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం నాటికి మొత్తం ఆరు మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో ఐదుగురు బాలికలు, ఒక బాలుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తన భర్త తనను తీవ్రంగా కొట్టాడని విచారణలో మహిళ చెప్పింది. దీంతో కోపోద్రిక్తురాలైన ఆ మహిళ రాత్రి వేళ తన పిల్లలను తీసుకొని బావి దగ్గరకు వెళ్లి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన పిల్లల వయసు 10 నుంచి 3 ఏళ్ల మధ్య ఉంటుంది. పిల్లలు చనిపోయారని నిర్దారించుకున్న తర్వాత మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి బావిలో దూకింది. అయితే స్థానికులు ఆమెను రక్షించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Follow us on