Crime: వీడేం మొగుడు..! కన్న బిడ్డల ముందే భార్యను కాల్చేసిన భర్త..!
హైదరాబాద్ శివారులో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో కన్న కూతుళ్ల ఎదుటే కట్టుకున్న భార్యకు నిప్పంటించాడు ఓ దుర్మార్గుడు. కుమార్తెలు ఎంత వద్దన్నా వినకుండా కర్కశంగా ప్రవర్తించాడు.
హైదరాబాద్ శివారులో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో కన్న కూతుళ్ల ఎదుటే కట్టుకున్న భార్యకు నిప్పంటించాడు ఓ దుర్మార్గుడు. కుమార్తెలు ఎంత వద్దన్నా వినకుండా కర్కశంగా ప్రవర్తించాడు. ఈ దారుణం మేడ్చల్ పోలీసు స్టేషన్పరిధిలో వెలుగుచూసింది.సూర్యానగర్లో తిరునగరి నరేంద్ర, అతని భార్య నవ్యశ్రీ వాళ్ల ఇద్దరు కూతుళ్లు మేఘన, చందనలతో కలిసి జీవిస్తున్నారు. ఫిబ్రవరి 18న భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నరేంద్ర.. తన భార్య నవ్యశ్రీ ఒంటిపై శానిటైజర్ పోసి నిప్పంటించాడు. ఇది గమనించి ఇరుగు పొరుగు ఆమె ఒంటికి అంటుకున్న మంటలను ఆర్పే ప్రయత్నించారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇరవై రోజులుగా చికిత్స పొందిన ఆమె.. ఆరోగ్యం విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో నవ్యశ్రీ కుమార్తెలిద్దరూ స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాడికి సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్వైడ్గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

