మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!

Updated on: Jan 17, 2026 | 11:28 AM

మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులకు రకరకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇటీవల సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవడం కోసం కొందరు పిచ్చి చేష్టలతో ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన ఘటనలూ ఉన్నాయి. కానీ, ప్రస్తుతం మెట్రోరైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళకు అందమైన అనుభవం ఎదురైంది. దానికి సంబంధించిన వివారాలు ఆమె తన సోషల్‌ మీడియా ఖాతాలో పంచుకున్నారు.

బెంగళూరులో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రీతూ జూన్ అనే యువతి జనవరి 12న మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఆమె పక్కన కూర్చున్న ఓ బాలిక చేతికి ఉన్న బంగారు గాజు డిజైన్ ఆమెకు బాగా నచ్చింది. దాంతో తనుకూడా అలాంటి గాజునే చేయించుకోవాలని భావించారు. దాంతో ఆ గాజు ధరించిన బాలికను ఆ గాజును ఒక ఫొటో తీసుకోవచ్చా? అని అడిగారు. అందుకు ఆ బాలిక ఏమాత్రం ఆలోచించకుండా తన చేతికున్న గాజును తీసి రీతూ చేతిలో పెట్టింది. డిజైన్ స్పష్టంగా కనిపించడానికి ఫొటో తీసుకోవడం మీకు ఈజీగా ఉంటుందని చెప్పింది. ఆమె నమ్మకానికి రీతూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆ బాలిక నవ్వుతూ అది నిజమైన బంగారం కాదని, ఆర్టిఫిషియల్ గాజు అని చెప్పింది.

మరిన్ని వీడియోల కోసం :

బలగం వేణు రెండో సినిమాపై క్లారిటీ వీడియో

ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?

యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్‌!

సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్