Viral: రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద.. దారుణంగా.!
ఉత్తర్ప్రదేశ్లో పోకిరీలు రెచ్చిపోయారు. భర్తతో కలిసి బైక్పై వెళ్తున్న మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఈ ఘటన లఖన్నవూలో జరిగింది. భారీగా వరద నీరు నిలిచిన స్థానిక తాజ్ హోటల్ బ్రిడ్జి మీదుగా భర్తతో కలిసి బైక్పై వెళుతున్న మహిళను కొందరు ఆకతాయిలు దారుణంగా వేధించారు. రోడ్డుపై వరద నీటిని దోసిళ్లతో ఆమెపై ఎత్తిపోస్తూ రాక్షసానందం పొందారు. ఈ వికృత చర్య నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆమెను కొందరు వెనక నుంచి అసభ్యంగా తాకి ఇబ్బంది పెట్టారు.
ఉత్తర్ప్రదేశ్లో పోకిరీలు రెచ్చిపోయారు. భర్తతో కలిసి బైక్పై వెళ్తున్న మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఈ ఘటన లఖన్నవూలో జరిగింది. భారీగా వరద నీరు నిలిచిన స్థానిక తాజ్ హోటల్ బ్రిడ్జి మీదుగా భర్తతో కలిసి బైక్పై వెళుతున్న మహిళను కొందరు ఆకతాయిలు దారుణంగా వేధించారు. రోడ్డుపై వరద నీటిని దోసిళ్లతో ఆమెపై ఎత్తిపోస్తూ రాక్షసానందం పొందారు. ఈ వికృత చర్య నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆమెను కొందరు వెనక నుంచి అసభ్యంగా తాకి ఇబ్బంది పెట్టారు. నీటిలో బైక్ నడపలేక వ్యక్తి ఇబ్బంది పడుతుంటే కొందరు వాహనాన్ని వెనక్కులాగి ఆ దంపతులు కింద పడిపోయేలా చేశారు. అయితే, పోలీసులు వెంటనే కలగజేసుకుని అల్లరి మూకలను చెదరగొట్టారు. కాగా ఈ ఘటన నెట్టింట పెనుకలకలానికి దారి తీసింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ మహిళపై ఆమె భర్త ముందే అల్లరి మూకలు రెచ్చిపోయిన తీరు అనేక మందిని ఆందోళనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే
చెరువులో నోట్ల కట్టలు.. పరిగెత్తుకెళ్లిన పోలీసులకు షాక్
వంట గ్యాస్ కష్టాలు.. బెలూన్లలో స్టోరేజీ
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి

