Floating House: 12 కోట్లతో నీళ్లలో తేలే ఇల్లు.. కానీ కొబ్బరికాయ కొట్టిన రోజే మునిగిపోయింది..!(వీడియో)

Updated on: Oct 20, 2022 | 9:57 AM

2 కోట్లు పెట్టి కట్టిన నీళ్లలో తేలే ఇల్లు.. లాంచింగ్ రోజే మునిగిపోయింది.. భారీగా డబ్బు ఖర్చు పెట్టి నీళ్లలో తేలియాడే భవనం కట్టించుకుంటే.. అది లాంచ్ చేసిన రోజే నీళ్లలో మునిగిపోతే ఎలా ఉంటుంది?


పనామా అనే కంపెనీకి అలాంటి అనుభవమే ఎదురైంది. ‘సీపాడ్’ పేరిట ఆ కంపెనీ ఒక భవనాన్ని తయారు చేసింది. ఇది నీళ్లలో తేలియాడుతూ ఉంటుంది. సుమారు 300 గజాల విస్త్రీర్ణంలో లివింగ్ రూం ఉంటుంది.ఇది కాకుండా దీనికి కొంచెం దూరంగా నీటి మట్టానికి 7.5 అడుగుల ఎత్తులో మూడు హాఫ్ ఫ్లోర్స్ కూడా ఉంటాయి. దీని నిర్మాణానికి 1.5 మిలియన్ డాలర్లు, మన లెక్కల్లో 12 కోట్ల రూపాయలకు పైగానే ఖర్చయిందట. దీన్ని లాంచ్ చేసే కార్యక్రమానికి పనామా కంపెనీ ప్రెసిడెంట్ కూడా వచ్చారు. అప్పటికే కొన్ని రోజులుగా ఆ నీళ్లలో ఉన్న ఈ సీపాడ్.. అందరూ చూస్తుండగానే అలా ఒక పక్కకు ఒరిగిపోయింది. దీంతో అక్కడకు వచ్చిన చాలా మంది భయపడిపోయారు.దీనిపై పనామా కంపెనీ వివరణ ఇచ్చింది. ‘సీపాడ్‌లోని బాలాస్ట్ ట్యాంక్, పంపింగ్ సిస్టంలో సాంకేతిక సమస్య కారణంగా జాకూజీ స్పా లో నీళ్లు చేరాయి. దీని వల్లనే సీపాడ్ ఇలా ఒరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కనీసం ఎవరి కాళ్లు కూడా తడవలేదు’ అని పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Follow Us