ఎంతకు తెగించారు.. టీచర్‌ను అశ్లీలంగా చిత్రించి..

|

Oct 02, 2024 | 8:16 PM

పెరుగుతున్న టెక్నాలజీ విద్యార్ధులు, యువతను పెడత్రోవ పట్టిస్తుందా? నేరాలకు ఆధునిక టెక్నాలజీ ఆజ్యం పోస్తోందా అనిపిస్తోంది ఈ ఘటన గురించి వింటే. అవును పెరుగుతున్న టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఉపాధ్యాయులను గౌరవిస్తూ చక్కగా చదువుకుని ప్రయోజకులు కావాల్సిన ఇద్దరు విద్యార్ధులు పెడదారి పట్టారు.

పెరుగుతున్న టెక్నాలజీ విద్యార్ధులు, యువతను పెడత్రోవ పట్టిస్తుందా? నేరాలకు ఆధునిక టెక్నాలజీ ఆజ్యం పోస్తోందా అనిపిస్తోంది ఈ ఘటన గురించి వింటే. అవును పెరుగుతున్న టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఉపాధ్యాయులను గౌరవిస్తూ చక్కగా చదువుకుని ప్రయోజకులు కావాల్సిన ఇద్దరు విద్యార్ధులు పెడదారి పట్టారు. సాంకేతిక విద్యను మంచికి ఉపయోగించుకుని ఉన్నత స్థానాలకు ఎదగాల్సిన విద్యార్ధులు దాన్ని మిస్ యూజ్ చేస్తూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ లోని ఓ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వారి ఉపాధ్యాయురాలి ఫోటోలను అశ్లీలంగా రూపొందించి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. అంతే కాకుండా మరికొందరు విద్యార్ధులు, ఉపాధ్యాయుల ఫోటోలతో ఇలాంటివి రూపొందించి వాటినీ వైరల్ చేస్తామని బెదిరించారు. ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ జరిగి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాధిత ఉపాధ్యాయురాలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఘోరం.. స్కూల్‌ అభివృద్ధి చెందాలని నరబలి

బర్త్‌డే గిఫ్ట్‌ పేరుతో పిచ్చి పని.. జస్ట్ మిస్

పోర్టులో కనిపించిన అనుమానాస్పద బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా కళ్లు బైర్లు!

నడుము అందాలతో నయని పావని మైండ్ బ్లోయింగ్ స్టిల్స్

స్మార్ట్‌ఫోన్‌ లేకుండా ఉండలేకపోతున్నారా ?? నోమోఫోబియా సోకిందేమో !!

Follow us on