Egypt mummies: 2,500 ఏళ్ల నాటి మ‌మ్మీలు.. ! వెలికి తీసిన శాస్త్ర‌వేత్త‌లు.. మరో అద్భుతమైన విషయం..?

|

Jun 07, 2022 | 8:34 PM

పురాతన ఈజిప్షియన్ కళాఖండాల నిధిని పురావస్తు శాస్త్రవేత్తలు మొదటిసారిగా ప్రపంచానికి విడుదల చేశారు. 250మ‌మ్మీల శ‌వ పేటిక‌ల‌ను కైరోకు స‌మీపంలోని స‌క్కారా స‌మాధుల నుంచి పురాతత్వ శాస్త్ర‌వేత్త‌లు బ‌య‌టికి తీశారు.


పురాతన ఈజిప్షియన్ కళాఖండాల నిధిని పురావస్తు శాస్త్రవేత్తలు మొదటిసారిగా ప్రపంచానికి విడుదల చేశారు. 250మ‌మ్మీల శ‌వ పేటిక‌ల‌ను కైరోకు స‌మీపంలోని స‌క్కారా స‌మాధుల నుంచి పురాతత్వ శాస్త్ర‌వేత్త‌లు బ‌య‌టికి తీశారు. ఈ కళాఖండాలు 2,500 సంవత్సరాల నాటివిగా గుర్తించారు. కళాఖండాలలో అనుబిస్, అమున్, మిన్, ఒసిరిస్, ఐసిస్, నెఫెర్టమ్, బాస్టెట్ మరియు హాథోర్ దేవతల విగ్రహాలు ఉన్నాయి. అలాగే సక్కార పిరమిడ్‌ను నిర్మించిన వాస్తుశిల్పి ఇమ్హోటెప్ తల లేని విగ్రహం కూడా ఉన్నట్టు గుర్తించారు. అవన్నీ క్రీస్తుపూర్వం 500 నాటివని చెబుతున్నారు. ఈజిప్టు పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ 250 శవపేటికలు, 150 కాంస్య విగ్రహాలు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంది. కాగా, తవ్వకాల్లో బయల్పడిన ఈ కళాఖండాలన్నింటినీ న్యూ గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియంకు తరలించారు. గిజా పిరమిడ్స్ కు సమీపంలో ఈ మ్యూజియంను నిర్మిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Follow us on