సర్కారీ పథకం డబ్బు తీసుకున్నారు.. భర్తలను వదిలేసి లవర్స్‌తో జంప్ అయిన భార్యలు

Updated on: Jul 12, 2024 | 6:53 PM

పక్కాఇళ్ల నిర్మాణానికి ‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన’ కింద కేంద్రం పేదలకు ఆర్థికసాయం అందిస్తోంది. కొన్నిచోట్ల ఈ పథకం దుర్వినియోగం అవుతున్నట్లు తెలిసింది. ఈ పథకం కింద మొదటివిడత సాయం పొందిన పలువురు వివాహితలు.. తమ భర్తలను వదిలేసి నచ్చినవారితో పారిపోయినట్లు తేలింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. యూపీలోని మహరాజ్‌గంజ్‌ జిల్లాలో ఇటీవల 2,350 మందికి ఆవాస్‌ యోజన నగదు విడుదలైంది.

పక్కాఇళ్ల నిర్మాణానికి ‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన’ కింద కేంద్రం పేదలకు ఆర్థికసాయం అందిస్తోంది. కొన్నిచోట్ల ఈ పథకం దుర్వినియోగం అవుతున్నట్లు తెలిసింది. ఈ పథకం కింద మొదటివిడత సాయం పొందిన పలువురు వివాహితలు.. తమ భర్తలను వదిలేసి నచ్చినవారితో పారిపోయినట్లు తేలింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. యూపీలోని మహరాజ్‌గంజ్‌ జిల్లాలో ఇటీవల 2,350 మందికి ఆవాస్‌ యోజన నగదు విడుదలైంది. తొలివిడతగా రూ.40 వేలు చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యింది. ఇదే సమయంలో తమ భార్యలు ప్రేమికులతో/నచ్చిన వారితో వెళ్లిపోయారంటూ అనేకమంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇలా జిల్లాలో 11 కేసులు నమోదైనట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ పథకం కింద రెండోవిడత నగదును నిలిపివేయాలని నిర్ణయించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. దేవుడో.. 16 కీటకాలు తినేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

సంస్కారం మరచిన యూట్యూబర్‌కి.. సర్కారు చెంప దెబ్బ

ఆయన తలపై గురిపెట్టుకున్న గన్స్‌ వేలం.. రూ. 15 కోట్లకు కొనుక్కున్న అజ్ఞాత వాసి

సుధీర్ బాబుకు బిగ్ ఝలక్.. ప్రాబ్లం ఏమై ఉంటుంది ??

SSMB29: మహేష్ బాబు – రాజమౌళి సినిమాకు.. ఆషాఢం ఎఫెక్ట్..

Loading...
Unable to load recommendations.
Follow Us