
భారతదేశంలో ఐఫోన్ 17 విడుదలతో ముంబైలోని బాంద్రాకుర్ల కాంప్లెక్స్లోని ఆపిల్ స్టోర్ వద్ద కస్టమర్ల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఐఫోన్ 17 కొనుగోలు కోసం విపరీతమైన జనం క్యూలో నిలబడటంతో తోపులాట ప్రారంభమైంది. కొంతమంది కస్టమర్లు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ ఘటనలో కొంతమంది గాయపడ్డారని వార్తలు వచ్చాయి. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కొందరు వ్యక్తులను అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు. ఈ ఘటన ఐఫోన్లకు ఉన్న డిమాండ్ను ప్రతిబింబిస్తుంది.