తెల్లారి మద్యం షాప్ తెరిచిన యజమాని.. లోపల కనిపించిన దృశ్యానికి కళ్లు తేలేశాడు..

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లోని బీజోన్ ఏరియాలో ఉన్న పెద్దమ్మతల్లి వైన్స్ షాప్‌లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. షాపులో ఉన్న రూ.40వేల నగదుతో పాటు రూ.20వేల విలువ చేసే మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు.

తెల్లారి మద్యం షాప్ తెరిచిన యజమాని.. లోపల కనిపించిన దృశ్యానికి కళ్లు తేలేశాడు..

|

Updated on: Mar 06, 2024 | 1:06 PM

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లోని బీజోన్ ఏరియాలో ఉన్న పెద్దమ్మతల్లి వైన్స్ షాప్‌లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. షాపులో ఉన్న రూ.40వేల నగదుతో పాటు రూ.20వేల విలువ చేసే మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోజూ మాదిరిగానే సోమవారం రాత్రి యజమాని మద్యం షాపును మూసివేసి ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉదయం ఎప్పటిలానే షాప్ ఓపెన్ చేసి చూడగా.. పైకప్పు మీదున్న సిమెంట్ రేకులు తొలిగి ఉండటాన్ని గమనించాడు. దుండగలు ఆ మార్గం ద్వారా షాప్‌లోకి దూరినట్టు గుర్తించాడు. మందమర్రి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ శశిధర్ రెడ్డి క్లూస్‌ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. షాప్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us