Aamani: భర్తతో విడాకులు తీసుకోవడానికి కారణమదే.. మొదటిసారి డివోర్స్ పై ఆమని కామెంట్స్..
చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమని.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు తల్లిగా.. అత్తగా పాత్రలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తున్నారు. అయితే కెరీర్ లో హీరోయిన్ గా సక్సెస్ అయిన ఆమని వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.
తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ ఆమని. అప్పట్లో అనేక చిత్రాల్లో నటించి అలరించారు. సీనియర్ హీరోలందరితో నటించిన ఆమని.. హీరోయిన్ గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ చీరకట్టులో.. సంప్రదాయ లుక్ లో కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమని.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు తల్లిగా.. అత్తగా పాత్రలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తున్నారు. అయితే కెరీర్ లో హీరోయిన్ గా సక్సెస్ అయిన ఆమని వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.
గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొ్న్న ఆమని.. మొదటి సారి కామెంట్స్ చేశారు. కెరీర్ మంచి ఫాంలో ఉన్న ఆమని. తమిళ సినిమా నిర్మాత ఖాజా మోహియుద్దీన్ వివాహం చేసుకుంది. వీరికి బాబు, పాప ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమని ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమని తన భర్త విడివిడిగా ఉన్నారు. తనకు సినిమాలంటే ఇష్టమని.. వ్యాపారాల్లో బిజీగా ఉన్నారని అన్నారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని… ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయామని అన్నారు. విడిపోయినా ఇప్పటికీ ఫ్రెండ్లీగానే మాట్లాడుకుంటున్నామని.. పిల్లలు మాత్రం తన వద్దే ఉంటున్నారని, సినిమాలు, పిల్లలే తన ప్రపంచం అన్నారు. ఆమని తెలుగులో అనేక చిత్రాల్లో నటించింది.
డైరెక్టర్ బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్లాం సినిమాలో నటించిన ఆమనికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు.. అలాగే ఈ మూవీలో నటనగానూ ఆమని ఉత్తమ నటిగా నంది బహుమతిగా అందుకున్నారు. తెలుగులో శుభలగ్నం, శుభసంకల్పం, మిస్టర్ పెళ్లాం, ఘరానా బుల్లోడు, అమ్మదొంగా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.