శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. April నెల దర్శన కోటా విడుదల

Updated on: Jan 19, 2026 | 9:41 PM

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త! టీటీడీ ఏప్రిల్ 2026 నెలకు సంబంధించిన వివిధ దర్శనం, సేవ, గదుల కోటాలను విడుదల చేయనుంది. ఆర్జిత సేవా టికెట్లు జనవరి 19న, కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవం వంటి సేవలు 22న, ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు టికెట్లు 23-24 తేదీల్లో విడుదలవుతాయి. వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనం కోటా జనవరి 23న, తిరుమల గదుల కోటా జనవరి 24న అందుబాటులోకి వస్తుంది. భక్తులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌. 2026 ఏప్రిల్‌ నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటా వివరాలను వెల్లడించింది. టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలపై స్పష్టత ఇచ్చింది. శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ కు సంబంధించిన ఏప్రిల్ నెల కోటాను జనవరి 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం జనవరి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ టికెట్లు పొందిన వారు జనవరి 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లను టీటీడీ మంజూరు చేస్తుంది. జనవరి 22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల చేయనున్నారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీ‌వారి సాల‌క‌ట్ల‌ వ‌సంతోత్స‌వాల‌ టికెట్లను 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది. ఇక వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. 23న ఉదయం 10 ంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది. అలాగే వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. తిరుమ‌ల‌, తిరుప‌తిలలో గదుల కోటాను జనవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జనవరి 27న శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటా విడుదల చేస్తారు. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటాను 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పట్టాలెక్కిన వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్

ఇరాన్ లో పరిస్థితి దారుణం.. క్షేమంగా స్వదేశానికి చేరుకున్న ప్రవాసులు

క్రిమినల్‌ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

Gold Price Today: ట్రంప్‌ ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన బంగారం, వెండిధరలు!

వణుకు పుట్టిస్తున్న పొగమంచు.. హైవేపై హెవీ ట్రాఫిక్‌ జామ్‌