Telangana: క్రికెటర్ సిరాజ్కు ప్రభుత్వం నజరానా.. జూబ్లీహిల్స్లో స్థలం కేటాయింపు..
టీ20 వరల్డ్ కప్లో విజేతగా నిలిచిన టీమిండియా మెంబర్, పేసర్ మహ్మద్ సిరాజ్కు ఇంటి స్థలం కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూబ్లీహిల్స్లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది.
టీ20 వరల్డ్ కప్లో విజేతగా నిలిచిన టీమిండియా మెంబర్, పేసర్ మహ్మద్ సిరాజ్కు ఇంటి స్థలం కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూబ్లీహిల్స్లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. టీ20 ప్రపంచకప్ సాధించిన తర్వాత హైదరాబాద్ చేరుకున్న సిరాజ్.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు టీమ్ ఇండియా జెర్సీని కూడా బహూకరించారు. ఈ సందర్భంగా.. సిరాజ్ను అభినందించిన సీఎం.. హైదరాబాద్లో ఇంటిస్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. స్థలాన్ని వెంటనే గుర్తించాలని.. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేయడంతో ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఇంటి స్థలం కేటాయిస్తూ జీవో జారీ చేసింది. జూబ్లీహిల్స్లోని ఇంటి స్థలానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రెవెన్యూశాఖ.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

