Watch Video: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..

|

May 31, 2024 | 3:33 PM

ఫోన్ ట్యాపింగ్ అంశంపై బీజేపీ ధర్నాకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. కేసు విచారణను పక్కదారి పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి రాకుండా ఉన్నంత వరకు బీజేపీ ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీరియస్‎గా దృష్టి సారించిందని తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్ అంశంపై బీజేపీ ధర్నాకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. కేసు విచారణను పక్కదారి పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి రాకుండా ఉన్నంత వరకు బీజేపీ ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీరియస్‎గా దృష్టి సారించిందని తెలిపారు. ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతోందని, మరిన్ని కీలక విషయాలు త్వరలో వెలుగులోకి వస్తాయని చెబుతున్నట్లు జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్‌ సహకరించిందన్న జీవన్ రెడ్డి.. అందుకు ప్రతిఫలంగా ఫోన్ ట్యాపింగ్‌ కేసు నుంచి కేసీఆర్‌ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందుకే ఈ అంశంపై నిరసనలు చేపట్టారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో రాష్ట్ర పోలీసులు సమర్థవంతంగా పని చేస్తున్నారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే రాధాకిషన్ రావు స్టేట్‌మెంట్లను రికార్డ్‌ చేశారన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on