ఆకాశంలో అద్భుతం.. సెప్టెంబర్‌ 7న డోంట్‌ మిస్‌

Updated on: Sep 01, 2025 | 7:51 PM

సెప్టెంబర్‌ 7న ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఆరోజు సపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు చంద్రుడు రోజూకంటే పూర్తి భిన్నంగా కనిపించనున్నాడు. నారింజ వర్ణంలో ప్రకాశిస్తూ కనిపించే ఈ చంద్రుడిని బ్లడ్‌ మూన్‌ అంటారు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా చంద్రుడు రంగు భిన్నంగా కనిపించనున్నాడు. దాదాపు 82 నిమిషాల పాటు ఈ బ్లడ్‌ మూన్‌ ఆకాశంలో కనువిందు చేయనుంది.

సెప్టెంబర్‌ 7న సంభవించే ఈ చంద్ర గ్రహణం ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. భారత్‌లోని ప్రజలు కూడా ఈ ఖగోళ అద్భుతాన్ని చూడవచ్చు. వాతావరణం అనుకూలించి, ఆకాశం నిర్మలంగా ఉంటే హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా,పూణే, లక్నో, చండీగఢ్ వంటి ప్రధాన నగరాల నుంచి ఈ చంద్రగ్రహణాన్ని చూడవచ్చు. ఇటీవలి కాలంలో ఇంత ఎక్కువ సమయం కనిపించే చంద్రగ్రహణం ఇదే కావడం విశేషం. సూర్యుడికి, చంద్రుడికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పూర్తిగా పడుతుంది. ఈ సమయంలో సూర్యుని కాంతి భూమి వాతావరణం గుండా ప్రయాణించి, వంగి చంద్రుడిపై పడుతుంది. ఈ ప్రక్రియలో నీలి రంగు కాంతి వాతావరణంలో కలిసిపోతుంది. కేవలం ఎరుపు, నారింజ రంగుల కాంతి కిరణాలు మాత్రమే చంద్రుడిని చేరతాయి. దీనివల్ల చంద్రుడు ప్రకాశవంతమైన ఎరుపు రంగులో దర్శనమిస్తాడు. ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు ఖగోళ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Upasana Konidela: ఈ స్థాయి ఎవరో ఇచ్చింది కాదు.. నాకు నేనుగా సాధించుకున్నది

4 నెలల్లో 6G వస్తోంది..ప్రధాని మోదీ కీలక ప్రకటన

Balakrishna: వరద బాధితులకు అండగా.. విరాళం ప్రకటించిన బాలయ్య

‘మిస్‌ అవుతున్నా నాన్నా..’ గౌతమ్‌ బర్త్‌ డే వేళ మహేష్ ఎమోషనల్

నా అత్తమ్మ తన కళ్లను దానం చేసింది.. ఫోటోలతో సహా.. చూపించిన చిరు

Loading...
Unable to load recommendations.
Follow Us