శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్‌

Updated on: Nov 22, 2025 | 12:38 PM

శ్రీశైలం దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం, కమాండ్ కంట్రోల్, హెల్ప్‌లైన్ కేంద్రాలు, డిజిటల్ సైన్‌బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక దర్శన టిక్కెట్లపై లడ్డూలు డిసెంబరు 1 నుంచి అమలవుతాయి. చెంచు గిరిజనులకు స్పర్శ దర్శనం, సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, కొలను భారతి ఆలయం దత్తత వంటివి ఆమోదించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యం.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి రెండో సమావేశంలో మొత్తం 14 అంశాలపై సుదీర్ఘ చర్చ జరపగా 11 అంశాలకు ఆమోదం తెలిపారు. ప్రత్యేక దర్శన టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఉచిత లడ్డూలతో పాటు ఆలయ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలని పాలక మండలి నిర్ణయించింది. డిసెంబరు 1వ తేదీ నుంచి స్వామి వారి 500 రూపాయల స్పర్శ దర్శన టికెట్‌పై రెండు 100గ్రాముల లడ్డూలు, రూ. 300 సర్వదర్శన టికెట్‌కు ఒక లడ్డూను ఉచితంగా ఇచ్చేందుకు ఆలయ బోర్డు ఆమోదించింది. ఇక శ్రీశైలం క్షేత్రంలో భక్తులకు కలుగుతున్న అసౌకర్యాల గురించి ఫిర్యాదులు, సలహాలను తెలిపే బాక్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భక్తుల సౌకర్యార్థం క్షేత్ర పరిధిలో ప్రధాన కూడలిలలో హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు మరింత సౌకర్యార్థంగా ఉండేందుకు ఆలయ పరిసరాల్లో డిజిటల్ సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే స్థానికంగా నివసిస్తున్న చెంచు గిరిజనులకు నెలలో ఒక్కరోజు స్వామివారి స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించారు. అలాగే శ్రీగిరిలో జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలని తీర్మానించారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం కొలను భారతి దేవాలయాన్ని దత్తత ఆలయంగా స్వీకరించాలని నిర్ణయించారు. ఇకపై శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలోనే ధూప,దీప నైవేద్యాలు నిర్వహించేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: సమంత పై రాజ్ నిడిమోరు కామెంట్స్‌

కోచింగ్‌ సెంటర్‌లో పరిచయం.. ఐబొమ్మ రవి లవ్‌ స్టోరీ

ప్రయాణికులకు షాకిచ్చిన ఆర్టీసీ డ్రైవర్‌.. ఏం చేశాడంటే

కారు డ్రైవర్‌ దాష్టీకం.. సైడ్‌ ఇవ్వలేదని

క్యూలో నిలబడి రూ.5ల భోజనం చేసిన కలెక్టర్‌