టీమ్లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్ మనకే వస్తుంది!
2027 వన్డే ప్రపంచకప్ కోసం సునీల్ గవాస్కర్ ప్రకటించిన 15 మంది సభ్యుల టీమిండియా డ్రీమ్ స్క్వాడ్ చర్చనీయాంశమైంది. శుభ్మన్ గిల్కు కెప్టెన్సీ అప్పగించగా, రిషభ్ పంత్, మహ్మద్ సిరాజ్లకు చోటు లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల సమతుల్యతతో రూపొందించిన ఈ జట్టుపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా స్వరూపం ఎలా ఉండబోతోందనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రకటించిన 15 మంది సభ్యుల ‘డ్రీమ్ టీమ్’ తీవ్ర దుమారం రేపుతోంది. అనుభవజ్ఞులు, కుర్రాళ్ల సమ్మేళనంతో పటిష్టమైన రోడ్మ్యాప్ను సిద్ధం చేసిన సన్నీ.. పలు సంచలన నిర్ణయాలతో విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచారు. ఈ స్క్వాడ్లో అందరినీ ఆకట్టుకున్న ప్రధాన అంశం టీమిండియా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ఓపెనర్ శుభ్మన్ గిల్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం. జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ, గిల్కే సారథ్య బాధ్యతలు ఇచ్చారు. టాప్ ఆర్డర్లో రోహిత్, గిల్, కోహ్లీలతో పాటు శ్రేయస్ అయ్యర్కు చోటు కల్పించారు. వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్లను ఎంపిక చేసిన గవాస్కర్, స్టార్ కీపర్ రిషభ్ పంత్కు స్థానం నిరాకరించి షాక్ ఇచ్చారు. ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాతో పాటు ఆంధ్రాకు చెందిన యువ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించారు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా నితీష్ జట్టుకు ఉపయోగపడతాడని భావించారు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ను ఎంచుకున్నారు. బౌలింగ్ విభాగంలో ఫామ్ లో ఉన్న మహమ్మద్ సిరాజ్ను పక్కన పెట్టి, జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని పేస్ దళంలోకి మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, యువ బౌలర్ హర్షిత్ రాణాలను తీసుకున్నారు. పంత్, సిరాజ్ లేకపోవడంపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఈ కాంబినేషన్ ట్రోఫీ తెచ్చిపెట్టేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్రూట్స్ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
ఆరోగ్యం కదా అని ఓఆర్ఎస్ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి!
మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో సరికొత్త మార్పులు !
రూ.4000 కోట్ల ‘రామాయణం’.. యశ్, రణబీర్ల పారితోషికం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంకే!
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా.. అరుదైన రాచనాగు ప్రత్యేకత ఇదే!
