5 ఫోర్లు, 3 సిక్సర్లతో బుడ్డోడి బీభత్సం

Updated on: Nov 19, 2025 | 12:47 PM

ఆసియా కప్ రైజింగ్ స్టార్ 2025లో పాకిస్తాన్ షాహీన్స్ చేతిలో ఇండియా ఏ జట్టు 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మాజ్ సదాకత్ ఆల్ రౌండర్ ప్రదర్శన పాక్ విజయంలో కీలకం. వైభవ్ సూర్యవంశీ (45 పరుగులు) ఒక్కడే రాణించినా, మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. అంపైర్ తప్పుడు నిర్ణయం, DRS లేకపోవడం భారత జట్టు పతనానికి దారితీసింది, కేవలం 136 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ఆసియా కప్ రైజింగ్ స్టార్ 2025లో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ షాహీన్ చేతిలో ఇండియా ఏ జట్టు ఓటమి పాలైంది. దోహాలో జరిగిన ఈ మ్యాచ్‌లో, మాజ్ సదాకత్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో పాకిస్తాన్ ఇండియా ఏ జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయగా, భారత జట్టు తొలి ఓటమిని చవిచూసింది. టీమ్ ఇండియా తరపున 45 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ గుర్తింపు పొందారు. ఖతార్‌లో జరుగుతున్న టోర్నమెంట్‌లోని రెండవ మ్యాచ్‌లో ఇండియా ఏ మొదట బ్యాటింగ్ చేసింది. వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనను కనబరిచాడు. మునుపటి మ్యాచ్‌లో తన అద్భుతమైన సెంచరీ తర్వాత, 14 ఏళ్ల స్టార్ ఓపెనర్ పాకిస్తాన్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుని, కేవలం 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో సహా 45 పరుగులు చేశాడు. వైభవ్, నమన్ ధీర్ తో కలిసి 49 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. అయితే, ఇతర బ్యాట్స్ మెన్స్ విఫలమయ్యారు. 91 పరుగుల వద్ద వైభవ్ వికెట్‌ను టీమిండియా కోల్పోయింది. దీంతో టీమిండియా పతనం ప్రారంభమైంది. తరువాతి 3 వికెట్లు కేవలం 13 పరుగుల వ్యవధిలో పడిపోయాయి. అయితే, అశుతోష్ శర్మ కూడా అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలి అయ్యాడు. ఈ టోర్నమెంట్‌లో DRS లేనందున, అతను అప్పీల్ చేయలేకపోయాడు. చివరికి, మొత్తం జట్టు 19 ఓవర్లలో కేవలం 136 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్తాన్ జట్టు తరపున, షాహిద్ అజీజ్ మూడు వికెట్లు తీసుకోగా, మాజ్ సదకత్ రెండు వికెట్లు పడగొట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంధువు ఆఖరి చూపు కోసం వెళ్లి వస్తూ అనంత లోకాలకు..

మరో కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నలుగురికి తీవ్రగాయాలు

చలి చంపేస్తున్న వేళ.. వాతావరణశాఖ భారీ వర్షాల అలర్ట్‌

మాటలకందని మహా విషాదం.. ఒకే కుటుంబంలో 3 తరాలను తుడిచేసిన ప్రమాదం