Saleshwaram jatara: తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
తెలంగాణ అమరనాథ్గా పేరుగాంచిన సలేశ్వరం జాతర సోమవారం ప్రారంభమైంది. చుట్టూ అడవి.. కొండ,కోనలు.. జలపాతాలు... పచ్చని ప్రకృతి రమణీయతతో అలరారే నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయలోని గుహలో కొలువైన లింగమయ్య దర్శనం సోమవారం వైభవంగా ప్రారంభమైంది. ప్రతిఏటా మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ జాతరకు ఒక్క తెలంగాణ నుంచే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాలనుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు.
తెలంగాణ అమరనాథ్గా పేరుగాంచిన సలేశ్వరం జాతర సోమవారం ప్రారంభమైంది. చుట్టూ అడవి.. కొండ,కోనలు.. జలపాతాలు.. పచ్చని ప్రకృతి రమణీయతతో అలరారే నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయలోని గుహలో కొలువైన లింగమయ్య దర్శనం సోమవారం వైభవంగా ప్రారంభమైంది. ప్రతిఏటా మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ జాతరకు ఒక్క తెలంగాణ నుంచే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాలనుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఏప్రిల్ 24వ తేదీ వరకు, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతిస్తారు. చైత్రశుద్ధ పౌర్ణమినాడు లింగమయ్య స్వామిని భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు కిలోమీటర్ల మేర కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుంటూ సలేశ్వరం గుడివద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ యాత్ర అమరనాథ్ యాత్రగా పేరుగాంచింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!