AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool: రైలు ఎక్కుతున్న వ్యక్తిని సడన్‌గా ఆపారు.. తీరా బ్యాగ్‌లోనివి చూసి ఆశ్చర్యపోయారు!

Kurnool: రైలు ఎక్కుతున్న వ్యక్తిని సడన్‌గా ఆపారు.. తీరా బ్యాగ్‌లోనివి చూసి ఆశ్చర్యపోయారు!

Ravi Kiran
|

Updated on: Mar 29, 2024 | 4:13 PM

Share

సమయం అర్ధరాత్రి 12 గంటలు.. ప్లేస్.. ఆదోని రైల్వే స్టేషన్. ఇక అప్పుడే.. ట్రైన్ నెంబర్ 17307.. మైసూర్ నుంచి బగల్‌కోట్ వెళ్లే బసవ ఎక్స్‌ప్రెస్.. మరికాసేపట్లో రెండో నెంబర్ ఫ్లాట్‌ఫామ్‌పైకి రాబోతోందంటూ ఓ అనౌన్స్‌మెంట్. ఇక ప్రయాణీకులందరూ ఆ రైలును ఎక్కేందుకు సిద్దమవుతుండగా.. ఇంతకీ ఆ తర్వాత ఏం జరిగిందంటే.. అది మనం తెలుసుకుందాం..

సమయం అర్ధరాత్రి 12 గంటలు.. ప్లేస్.. ఆదోని రైల్వే స్టేషన్. ఇక అప్పుడే.. ట్రైన్ నెంబర్ 17307.. మైసూర్ నుంచి బగల్‌కోట్ వెళ్లే బసవ ఎక్స్‌ప్రెస్.. మరికాసేపట్లో రెండో నెంబర్ ఫ్లాట్‌ఫామ్‌పైకి రాబోతోందంటూ ఓ అనౌన్స్‌మెంట్. ఇక ప్రయాణీకులందరూ ఆ రైలును ఎక్కేందుకు సిద్దమవుతుండగా.. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఆర్‌పీఎఫ్ పోలీసులకు ఓ వ్యక్తిపై అనుమానం కలిగింది. అతడి కదలికలు అన్ని డౌట్ వచ్చేలా ఉండటంతో.. బసవ ఎక్స్‌ప్రెస్ ఎక్కుతుండగా.. సదరు వ్యక్తిని ఆపి చెక్ చేశారు. అతడి బ్యాగ్‌లోనివి చూసి పోలీసుల దిమ్మతిరిగింది.

వివరాల్లోకెళ్తే.. కర్నూలు జిల్లాలోని ఆదోని రైల్వేస్టేషన్‌లో భారీగా బంగారు బిస్కెట్లను సీజ్ చేశారు పోలీసులు. స్థానిక హవునాపేటకు చెందిన 28 ఏళ్ల మొయినుద్దీన్.. గురువారం అర్ధరాత్రి బసవ ఎక్స్‌ప్రెస్.. ఎస్9 కోచ్ ఎక్కబోతుండగా.. అనుమానమొచ్చిన ఆర్‌పీఎఫ్ పోలీసులు అతడి బ్యాగ్ సెర్చ్ చేశారు. అందులో 618 గ్రాముల బిస్కెట్లు ఉన్నట్టు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ. 41 లక్షలు ఉంటుందని అంచనా. తమ దగ్గర నగల తయారీ మెషిన్లు లేవని.. అందుకే ఈ బిస్కెట్లను ఆదోని నుంచి గుల్బర్గాకు తీసుకెళ్తున్నానని పోలీసులకు చెప్పాడు సదరు వ్యక్తి. అయితే ఆ బంగారు బిస్కెట్ల సరైన రసీదులు, ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసి ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు రైల్వే పోలీసులు.