పడగలో పల్లెలు.. పగబట్టినట్లు వరుసగా పాము కాట్లు
గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు పాముకాట్ల బెడదతో అట్టుడుకుతున్నాయి. వర్షాకాలం ప్రారంభంతో పాముల సంచారం గణనీయంగా పెరిగి, ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఐదుగురు పాము కాటుకు గురై మరణించారు. మృతులలో ముగ్గురు మహిళలు ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులు, కూలీలు తరచుగా పొలాల్లోనే ఉంటారు. చెప్పులు లేకుండా పని చేసే సమయంలో చాలామంది పాము కాట్లకు గురవుతున్నారు. నాగుపాము, కట్లపాము, రక్త పింజరి, పిట్ వైపర్ వంటి విషపూరిత పాములు ఈ ప్రాంతంలో అధికంగా సంచరిస్తున్నాయి. పాము కాటుకు గురైనప్పుడు నాటు వైద్యాలను ఆశ్రయించకుండా, గాయం కట్టకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని నిపుణులు, స్నేక్ సేవియర్ సొసైటీ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. సకాలంలో సరైన చికిత్స అందితే ప్రాణాలు కాపాడవచ్చని వారు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెద్ది అప్డేట్స్ విషయంలో సైలెన్స్
జోరు చూపిస్తున్న రాజాసాబ్.. డార్లింగ్ ఫ్యాన్స్ను ఎలర్ట్ చేస్తున్న మేకర్స్
గుడ్ న్యూస్ చెప్పిన గీతా గోవింద్
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..
హైదరాబాద్కు బీచ్ వచ్చేస్తోందోచ్

