AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోన్ తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త! బ్యాంకుల ఇష్టారాజ్యానికి చెక్!

లోన్ తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త! బ్యాంకుల ఇష్టారాజ్యానికి చెక్!

Phani CH
|

Updated on: Aug 21, 2026 | 9:00 PM

Share

రుణగ్రహీతలకు ఊరటనిచ్చేలా ఆర్‌బీఐ కొత్త డ్రాఫ్ట్ మార్గదర్శకాలను ప్రతిపాదించింది. ఫ్లోటింగ్ రేట్ రుణాలను బాహ్య బెంచ్‌మార్క్‌తో అనుసంధానం చేయడం, వడ్డీ రీసెట్ విధానంలో పారదర్శకత పెంచడం ఇందులో కీలకం. ఇప్పటికే ఉన్న రుణగ్రహీతలు కూడా నిర్దిష్ట గడువులో ఎలాంటి అదనపు రుసుములు లేకుండా కొత్త విధానంలోకి మారే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే రేట్లు తగ్గినప్పుడు ఆ ప్రయోజనం రుణగ్రహీతలకు వేగంగా చేరే అవకాశం ఉంది.

రుణగ్రహీతలకు మరింత ఊరటనిస్తూ, వడ్డీ రేట్ల నిర్ణయం మరియు పునఃసమీక్ష విధానంలో పారదర్శకతను పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన డ్రాఫ్ట్ మార్గదర్శకాలను ప్రతిపాదించింది. బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ సంస్థలు ఫ్లోటింగ్ రేట్ రుణాలపై ఇష్టానుసారం వడ్డీలను మార్చకుండా అడ్డుಕట్ట వేయడమే ఈ కొత్త నిబంధనల ముఖ్య ఉద్దేశం. ఈ ఫ్రేమ్‌వర్క్ ప్రస్తుతం ముసాయిదా దశలో ఉండగా, సెప్టెంబర్ 11, 2026 వరకు అభిప్రాయాలను ఆహ్వానించారు. అన్నీ అనుకూలిస్తే ఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2027 నుండి అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ తప్పనిసరి: వాణిజ్య బ్యాంకులు ఇచ్చే ఫ్లోటింగ్ రేట్ పర్సనల్ లోన్లు, హోమ్ లోన్లు, మరియు ఎంఎస్‌ఎంఈ (MSME) రుణాలు అన్నీ తప్పనిసరిగా ఆర్‌బిఐ రెపో రేటు లేదా ట్రెజరీ బిల్లుల వంటి బాహ్య బెంచ్‌మార్క్‌తో అనుసంధానించాల్సి ఉంటుంది. నెలలకోసారి రీసెట్: వడ్డీ రేట్లను మార్చే ప్రక్రియను కనీసం ప్రతి 3 నెలలకు ఒకసారి మాత్రమే చేపట్టాలని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. దీనివల్ల, ఆర్‌బిఐ రెపో రేటు తగ్గించిన ప్రతిసారీ ఆ ప్రయోజనం వెంటనే వినియోగదారుడికి అందుతుంది. బ్యాంకులు ఇకపై ఎలాంటి ఆలస్యం చేయకుండా 3 నెలల వ్యవధిలోనే ఈఎంఐ లేదా లోన్ కాలపరిమితిని తగ్గించాల్సి ఉంటుంది. పూర్తి పారదర్శకత: లోన్ తీసుకునే సమయంలో బెంచ్‌మార్క్ రేటు ఎంత, బ్యాంక్ మార్జిన్ ఎంత, వడ్డీలను రీసెట్ చేసే తేదీలు ఏమిటనే పూర్తి వివరాలను అగ్రిమెంట్‌లో స్పష్టంగా పేర్కొనాలి. పాత రుణగ్రహీతలకు ఊరట: ఇప్పటికే పాత బెంచ్‌మార్క్ విధానాల్లో లోన్లు తీసుకున్నవారికి కూడా ఇది గొప్ప అవకాశం. ఏప్రిల్ 1, 2029 నాటికి ఎలాంటి అదనపు రుసుములు లేకుండా ఉచితంగా కొత్త ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ విధానంలోకి మారే వెసులుబాటును ఆర్‌బిఐ కల్పించింది. ఈ నిబంధనలు అన్ని వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, మరియు హెచ్‌ఎఫ్‌సీలకు వర్తిస్తాయి. మొత్తానికి, ఈ విధానం అమలైతే ఆర్‌బిఐ రేట్లు తగ్గించినప్పుడు ఆ ప్రయోజనం సామాన్య వినియోగదారుడికి వేగంగా చేరుతుంది. అయితే, అదే సమయంలో రేట్లు పెరిగినప్పుడు ఈఎంఐ లేదా రుణ వ్యవధి కూడా త్వరగా పెరిగే అవకాశం ఉంటుందనే విషయాన్ని రుణగ్రహీతలు గుర్తుంచుకోవాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు

Irumudi Review: రవితేజ ఖాతాలో హిట్ పడిందా? లేదా ? ఇరుముడి రివ్యూ

Omkuchi Narasimhan: ఈ స్టార్ కమెడియన్ కొడుకు ఇప్పుడు ప్రముఖ స్వామిజీ అని తెలుసా?

Follow Us