Kaleshwaram Row: కాళేశ్వరంపై కామెంట్లు.. కౌంటర్లు..

Edited By:

Updated on: Mar 30, 2026 | 11:21 PM

తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించగా, బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలకే కాకుండా మొత్తం కాళేశ్వరంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది. ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత పెంచింది.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆరోపణలు తెలంగాణ అసెంబ్లీని మరోసారి కుదిపేశాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం భారీ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. అవినీతి కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో జైల్లో పెడతామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఏమయ్యాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై ఓట్లు, సీట్లు పంచుకున్నాయని ఆరోపించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి

తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..

ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!

చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు

నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??

Follow Us